ISRO: వందల సంవత్సరాల పోరాటంతో సాధించుకున్న స్వాతంత్య్ర భారతం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది (2022)లో రెండు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలను చేపట్టబోతున్నదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చీఫ్ ఎస్.సోమనాథ్ అన్నారు. Asianet News కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కొత్త చైర్మన్గా సీనియర్ శాస్త్రవేత్త, రాకెట్ ఇంజనీరింగ్ నిపుణుడు ఎస్ సోమనాథ్ నియమితులయ్యారు. ప్రస్తుత చైర్మన్ కే శివన్ పదవీకాలం జనవరి 14తో ముగియనుండటంతో ఆయన వారసుడిగా సోమనాథ్ను ఎంపిక చేసింది కేంద్రం. ఆయన మూడు సంవత్సరాల పాటు ఇస్రో ఛైర్మన్గా కొనసాగుతారు. సోమనాథ్ 2018 జనవరి 22 నుంచి విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్ర భారతం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఏడాది (2022)లో రెండు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలను చేపట్టబోతున్నదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త చీఫ్ ఎస్.సోమనాథ్ అన్నారు. Asianet News కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
Asianet News కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఇస్రో (Indian Space Research Organisation) కొత్త చీఫ్ ఎస్.సోమనాథ్ మాట్లాడుతూ... ఈ ఏడాది (2022)లో రెండు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలను చేపట్టబోతున్నదని తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని అభివృద్ధి చేసే అధునాతన దశలో ఉందని అన్నారు. భూమి కక్ష్యకు తక్కువ దూరంలో ప్రయాణించే వాహనాల తయారీలో ఉన్నామని తెలిపారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మొదటి ప్రయోగం కూడా కొన్ని నెలల్లోనే ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "తక్కువ ధర ప్రయోగ వాహనాలపై చాలా ఆసక్తి ఉంది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కొత్తవారు ఉన్నారు. ఇది అంతరిక్ష ప్రయోగ సేవల్లో మంచి పోటీని తెరుస్తోంది. ఇస్రో కూడా అదే బాటలో ఉంది. కరోనా మహమ్మారి ప్రణాళికలలో కొన్నింటిని ఆలస్యం చేసినప్పటికీ, మేము ఆశాజనకంగా ముందుకు సాగుతున్నాం" అని సోమనాథ్ వెల్లడించారు. భూకక్ష్యకు తక్కువ దూరంలో ప్రయాణించే వాహనాల RLV ల్యాండింగ్ ట్రయల్ పూర్తి చేయడం, ల్యాండింగ్ గేర్ మెకానిజమ్ని పరీక్షించడం చర్యలు అతి త్వరలోనే ఉంటాయని తెలిపారు.
"ఇది సాధారణ విమానం లాగా ల్యాండ్ అయ్యే స్థిర-వింగ్ మోడల్. మేము (ISRO) విస్తృతమైన ట్రయల్స్ నిర్వహిస్తూ.. ప్రయోగాలు కొనసాగించాం. అసలు ల్యాండింగ్ను త్వరలో పరీక్షించవలసి ఉంది. ఫలితాలతో మేము సంతృప్తి చెందిన తర్వాత, మేము దానిని తక్కువ-కక్ష్యలో ప్రయాణించడానికి ఉపయోగిస్తాము. ఈ ఏడాదిలోనే దీనిని చేపట్టబోతున్నాం. SSLV డిజైన్, డెవలప్మెంట్ దాదాపు పూర్తయింది. మేము దీన్ని నెలరోజుల్లో ప్రారంభిస్తాము" అని ఇస్రో చీఫ్ అన్నారు. ఇస్రో ముందు రెండు కీలక సవాళ్లు ఉన్నాయనీ, అంతర్జాతీయంగా వాణిజ్య పోటీని అనుగుణంగా పురోగతి సాధించడం.. అనుకున్న లక్ష్యాలను సాధించడం, సవాళ్లను స్వీకరించడం అని సోమనాథ్ అభిప్రాయపడ్డారు. "కాబట్టి RLV అనేది ఒక ప్రాధాన్యత కలిగి విషయం. ఇది ప్రయోగ ఖర్చును భారీగా తగ్గిస్తుంది. అదేవిధంగా, మనకు 15 సార్లు వరకు ఉపయోగించగల లాంచ్ వెహికల్స్ అవసరం. ఏవైనా ఖర్చులను తగ్గించడం అనేది మరిన్ని ప్రయోగాలు చేయగానికి అనుకూల వాతావరణ కల్పిస్తుంది" అని సోమనాథ్ అన్నారు. దీనికి పలు ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. ఉపగ్రహాల సముదాయం కమ్యూనికేషన్ టెక్నాలజీపై చూపే అనుపాత ప్రభావాన్ని ఉదహరించారు.
"మేము (ISRO) ఎటువంటి సమయ వ్యవధి లేకుండా నేరుగా హ్యాండ్హెల్డ్ పరికరాలకు ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము. ఇది సమాచారం, ఇన్ఫోటైన్మెంట్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నది. అదేవిధంగా, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు లేదా ఇతర తక్కువ-కక్ష్యలను ఉపయోగించి అంతరిక్ష అనువర్తనాన్ని మెరుగుపరచడంలో కూడా తక్కువ-ధర ప్రయోగం సహాయపడుతుంది. ఇది తిరిగి సందర్శించే సమయాన్ని గణనీయంగా తక్కువగా చేస్తుంది. కృత్రిమ మేధస్సు సహాయంతో మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి వీలు కల్పిస్తుందనీ, ఆ విధంగా సాగే సేవలను అమలు చేయాలని మేము ఆశిస్తున్నాము" అని ఆయన అన్నారు.అలాగే, "కొత్త ఇంజన్లు, కొత్త మెటీరియల్ల అభివృద్ధి కూడా ప్రయోగ ఖర్చులను తగ్గించగలదు. దీంతో అంతరిక్షంలో మరిన్ని ప్రయోగాలు.. వాతావరణ సేవలను మరింతగా మెరుగుపర్చడంలో నిస్సందేహంగా సహాయపడతాయిష అని ఇస్రో (Indian Space Research Organisation) చీఫ్ ఎస్.సోమనాథ్ అన్నారు.