రూ.500కోసం హత్య.. డ్రగ్స్ కొనుగోలు విషయంలో వివాదం, ముదిరి స్నేహితుడి హతం...

By SumaBala BukkaFirst Published Sep 22, 2022, 10:23 AM IST
Highlights

డ్రగ్స్ కొనడానికి రూ. 500 సంబంధించి జరిగిన గొడవల స్నేహితుడి ప్రాణాలు తీశాడో యువకుడు. ఢిల్లీలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ :  500 రూపాయల కోసం తన స్నేహితుడిని హత్య చేశాడు ఓ యువకుడు. 25 ఏళ్ల ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సెప్టెంబర్ 18, ఆదివారం రోజున జరిగింది. వారిద్దరికీ డ్రగ్స్ అలవాటు ఉంది. వీరు డ్రగ్స్ కు బానిసలయ్యారు. వారి మధ్య ఏదో విషయానికి వాగ్వాదం చెలరేగింది. ఆ తర్వాత నిందితుడు బాధితుడిని కత్తితో పొడిచారు. సెప్టెంబరు 18వ తేదీ రాత్రి 10.40 గంటలకు, ఒక ఆస్పత్రి నుంచి పోలీసులకు ఫోన్ వచ్చింది. ఒంటిపై పదునైన గాయంతో ఓ వ్యక్తి ఆస్పత్రిలో చేరాడని, ఆతని పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స అందించామని.. అతను చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రివర్గాలు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే.. ఆసుపత్రికి చేరుకున్న పోలీసు బృందం మరణించిన వ్యక్తిని 22 ఏళ్ల షారుక్‌గా గుర్తించింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. షారూఖ్ ఐరన్ ఫ్యాక్టరీలో డై మేకర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ఘటన జరిగిన రోజు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తన స్నేహితుడు సల్మాన్‌తో కలిసి కనిపించాడు. వారిద్దరూ డ్రగ్స్‌కు బానిసలని, ఘటన జరిగిన రోజు డ్రగ్స్‌ విషయంలో గొడవ పడ్డారని తేలింది. ఆ తర్వాత సల్మాన్ కనిపించకుండా పోయాడు.

సరదాగా తిరునాళ్లకు వెడితే... మైనర్ ను వివస్త్రను చేసి గ్యాంగ్ రేప్..నగ్నంగా గ్రామానికి వస్తుండగా వీడియో తీసి..

సల్మాన్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. తమకు అందిన పక్కా సమాచారం మేరకు జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో వలవేసి సల్మాన్‌ను పట్టుకున్నారు. పోలీసుల ముందు చేసిన నేరాన్ని అంగీకరించాడు సల్మాన్. ఆ తరువాత జరిగిన విషయాన్ని వివరించాడు. సల్మాన్, షారుక్ స్నేహితులు. షారుక్ డ్రగ్స్ తీసుకురావాలని సల్మాన్ కు రూ.500 ఇచ్చాడు. ఆ తరువాత దీనిమీద వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు వెల్లడించాడు. దీంతో పట్టలేని కోపంతో ప్రతీకారం తీర్చుకునేందుకు షారుక్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయానని చెప్పుకొచ్చాడు. 

click me!