Muharram 2022: మొహర్రం ఊరేగింపునకు ముస్తాబవుతున్న హైదరాబాద్.. శిథిలావస్థలోకి చేరిన కొన్ని ఆషుర్ఖానాలు..

Published : Aug 02, 2022, 10:43 AM ISTUpdated : Aug 02, 2022, 10:54 AM IST
Muharram 2022: మొహర్రం ఊరేగింపునకు ముస్తాబవుతున్న హైదరాబాద్.. శిథిలావస్థలోకి చేరిన కొన్ని ఆషుర్ఖానాలు..

సారాంశం

Muharram 2022: మొహర్రం పండుగనే పీర్ల పండుగ అంటారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగలో ముస్లిం లతో పాటుగా హిందువులు కూడా పాల్గొంటారు.

Muharram 2022: మహమ్మద్ ప్రవక్త మనుమడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ వర్దంతిని పురస్కరించుకుని అషుర్ఖానాలతో ముస్లిం క్యాలెండర్ మొదటి నెల మొహర్రం ఆదివారం నాడు ప్రారంభమైంది. మొహర్రం 10 వ రోజైన ఆగస్టు 9 న హైదారాబాద్ లో Yaum-e-Ashura ను నిర్వహించనున్నారు.  కాగా ఎన్నో చారిత్రక అషుర్ఖానాల మరమ్మత్తులకు నిధులు లేకపోవడంతో శిథిలావస్థలో ఉన్నాయి. వీటికి మరమ్మత్తులు చేయండని అధికారుకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఐదు శతాబ్దాల నాటి బాద్షాహీ ఆషుర్జానా అన్నింటికంటే మరీ మరీ దారుణంగా శిథిలావస్థకు గురైంది. దీన్ని 1590 ల ప్రారంభంలో నిర్మించిన హైదరాబాద్ లో నిర్మించిన మొదటి కొన్ని భవనాల్లో ఒకటి. 

ముస్లిం క్యాలెండర్ ప్రకారం..  ఈ ఏడాది జరుపుకునే మొహర్రం 444 వది.  చార్మినార్ నిర్మాణం, హైదరాబాద్ పుట్టి ఇప్పటికీ 444 ఏండ్లు అవుతోంది. ఎంతో మంది గైడెడ్ several heritage experts చార్మినార్,  దాని పరిసరాల ప్రాంతాల అరుదైన ఛాయాచిత్రాల ప్రదర్శన ద్వారా నగరం పుట్టిన వేడుకలను నిర్వహించారు. చార్మినార్ లో ఎగ్జిబిషన్ ను ఇంటాక్ నగర కన్వీనర్ పి.అనురాధారెడ్డి ప్రారంభించారు. ఈ ఫోటో ఎక్స్ పోను ఇంటాచ్, డెక్కన్ ఆర్కైవ్స్ సంయుక్తంగా నిర్వహించాయి.

అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కొన్ని ఆషుర్ఖానాల లోపల నీరు నిల్వ ఉండటంతో పాటుగా చెత్త కూడా పేరుకుపోయిందని భక్తులు చెబుతున్నారు. అషుర్ఖానా నాల్-ఎ-ముబారక్ సమీపంలో చెత్త దారుణంగా పేరుకుపోయిందని షియా సీనియర్ నాయకుడు హనీఫ్ అలీ చెప్పారు.

బడాషాహి అషుర్ఖానాకు చెందిన అబ్బాస్ అలీ మూస్వి మాట్లాడుతూ.. నక్కర్ ఖానా వంటి ప్రాంగణంలోని చారిత్రాత్మక కట్టడాలు కూలిపోయేపోయే స్థితిలో ఉన్నాయన్నారు. ప్రధాన భవనానికి కూడా కొన్ని మరమ్మత్తులు అవసరమవుతాయన్నారు.

ప్రవక్త కుటుంబ సభ్యుల పవిత్ర అవశేషాలతో హైదరాబాద్ లో అనేక అషుర్ఖానాలు ఉన్నాయి. కుతుబ్ షాహీల కాలంలో ఈ అవశేషాలను హైదరాబాదుకు తీసుకువచ్చారు. అవి నేటీకి భద్రంగా ఉన్నాయి. అలాగే కర్బలా యుద్ధం అవశేషాలు కూడా నగరం అషుర్ఖానాలలో భద్రపరచారు. 

హైదరాబాద్ లో మొహర్రం ఆచరించే సంప్రదాయం.. కుతుబ్ షాహీల కాలం నాటిదని నగర చరిత్రకారులు చెబుతారు. హైదరాబాద్ స్థాపకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా కుమార్తె హయత్ బక్ష్ బేగం మొహర్రం సందర్భంగా లంగర్ ఊరేగింపు సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఆమె తన కాలంలో అత్యంత శక్తివంతమైన మహిళలగా గుర్తింపు పొందింది. అంతేకాదు మొఘలుల ఆక్రమణలో ఏకవచనంతో వ్యవహరించింది.

మొహర్రం మొదటి రోజును పురస్కరించుకుని వివిధ మత సమూహాలు, మతపెద్దలచే ప్రత్యేక ప్రార్థనలు, సంతాప 'నోహా' పఠనం జరుగుతుంది.  ఆగస్టు 9 న ప్రధాన మొహర్రం ఊరేగింపు జరుగుతుంది.

PREV
click me!

Recommended Stories

Blouse Designs: కళ్లు చెదిరిపోయేలా హెవీ బ్లవుజు డిజైన్లు
డిసెంబర్ లో కచ్చితంగా చూడాల్సిన ప్రదేశం ఇది