ట్విటర్‌కు మరోషాకిచ్చిన కేంద్రం.. రెచ్చగొడుతోందంటూ సంస్థతో పాటు పలువురిపై తొలి కేసు నమోదు..

Ashok Kumar   | Asianet News
Published : Jun 16, 2021, 01:12 PM ISTUpdated : Jun 16, 2021, 01:13 PM IST

కొత్త ఐటి నిబంధనలను పాటించనందుకు మైక్రోబ్లాగింగ్ ఫ్లాట్ ఫార్మ్ ట్విట్టర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కొత్త ఐటి నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం ట్విట్టర్‌ పై కఠినమైన  చర్యలు ప్రారంభించింది.  తప్పుడు సమాచారం, వినియోగదారుల రక్షణ అంశంలో కేంద్రం, ట్విటర్‌ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియాలో ఉన్న చట్టపరమైన రక్షణను తాజాగా కేంద్రం ఎత్తివేసింది.

PREV
17
ట్విటర్‌కు  మరోషాకిచ్చిన  కేంద్రం..  రెచ్చగొడుతోందంటూ సంస్థతో పాటు పలువురిపై తొలి కేసు నమోదు..

దీంతో ట్విట్టర్ ఇప్పుడు భారతదేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయింది. అంటే ట్విట్టర్‌లో ఒక యూజర్ ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం పోస్టు చేస్తే పోలీసులు ఇప్పుడు ఆ విషయంలో భారతదేశంలోని మేనేజింగ్ డైరెక్టర్‌తో సహా ఉన్నతాధికారులను విచారించవచ్చు. కొత్త ఐటీ నిబంధనలపై చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌తో సహా భారతదేశానికి చెందిన అధికారుల నియామకాల్లో ఆలస్యం కావడంతో ఈ చర్య జరిగింది.

దీంతో ట్విట్టర్ ఇప్పుడు భారతదేశంలో చట్టపరమైన రక్షణను కోల్పోయింది. అంటే ట్విట్టర్‌లో ఒక యూజర్ ఏదైనా చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం పోస్టు చేస్తే పోలీసులు ఇప్పుడు ఆ విషయంలో భారతదేశంలోని మేనేజింగ్ డైరెక్టర్‌తో సహా ఉన్నతాధికారులను విచారించవచ్చు. కొత్త ఐటీ నిబంధనలపై చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌తో సహా భారతదేశానికి చెందిన అధికారుల నియామకాల్లో ఆలస్యం కావడంతో ఈ చర్య జరిగింది.

27

మీడియా నివేదికల ప్రకారం మే 25 నుండి అమలు చేసిన కొత్త  ఐటి నిబంధనలను ట్విట్టర్ ఇంకా పాటించలేదు. ఈ కారణంగా ట్విట్టర్‌కు భద్రతా హక్కులను తొలగించడం జరిగింది. సంస్థ  వైఖరి కొత్త ఐటి నిబంధనలకు అనుగుణంగా లేవని, అందువల్ల ఈ  చట్టపరమైన రక్షణ తొలగించబడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇన్ఫ్లమేటరీ పోస్టు చేస్తే పోలీసులు అధికారులను విచారించగలుగుతారు. ట్విట్టర్‌ కాకుండా గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా సంస్థలకు  ఎప్పటిలాగే చట్టపరమైన రక్షణ కొనసాగిస్తాయి.
 

మీడియా నివేదికల ప్రకారం మే 25 నుండి అమలు చేసిన కొత్త  ఐటి నిబంధనలను ట్విట్టర్ ఇంకా పాటించలేదు. ఈ కారణంగా ట్విట్టర్‌కు భద్రతా హక్కులను తొలగించడం జరిగింది. సంస్థ  వైఖరి కొత్త ఐటి నిబంధనలకు అనుగుణంగా లేవని, అందువల్ల ఈ  చట్టపరమైన రక్షణ తొలగించబడిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఇన్ఫ్లమేటరీ పోస్టు చేస్తే పోలీసులు అధికారులను విచారించగలుగుతారు. ట్విట్టర్‌ కాకుండా గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సోషల్ మీడియా సంస్థలకు  ఎప్పటిలాగే చట్టపరమైన రక్షణ కొనసాగిస్తాయి.
 

37

కొత్త ఐటి నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు మే 25 లోగా  భారతదేశానికి చెందిన అధికారులను నియమించాల్సి ఉంది, కాని లాక్ డౌన్ ఇతర సమస్యలను చూపుతూ చాలా సంస్థలు ఈ నియామకాలు చేయలేదు. ట్విట్టర్ మొదట్లో కొన్ని నియామకాలు చేసింది, కాని ఇవి న్యాయ సలహాదారులకు వెలుపల ఉన్నందున ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఎందుకంటే ఈ వ్యక్తులు సంస్థతో నేరుగా సంబంధం కలిగి లేరు.
 

కొత్త ఐటి నిబంధనల ప్రకారం సోషల్ మీడియా సంస్థలు మే 25 లోగా  భారతదేశానికి చెందిన అధికారులను నియమించాల్సి ఉంది, కాని లాక్ డౌన్ ఇతర సమస్యలను చూపుతూ చాలా సంస్థలు ఈ నియామకాలు చేయలేదు. ట్విట్టర్ మొదట్లో కొన్ని నియామకాలు చేసింది, కాని ఇవి న్యాయ సలహాదారులకు వెలుపల ఉన్నందున ప్రభుత్వం వాటిని తిరస్కరించింది. ఎందుకంటే ఈ వ్యక్తులు సంస్థతో నేరుగా సంబంధం కలిగి లేరు.
 

47

ఇప్పటివరకు ట్విట్టర్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పదే పదే హెచ్చరించినప్పటికి కూడా సంస్థ ఎటువంటి దృఢమైన చర్యలు తీసుకోలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి సంబంధించిన కొత్త నిబంధనలను పాటించడానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం జూన్ 5న ట్విట్టర్‌కు ఇచ్చిన తుది నోటీసులో పేర్కొంది.  కొత్త ఐ‌టి  నిబంధనలను వెంటనే పాటించాలి అలా చేయడంలో విఫలమైతే ఐటి చట్టం ప్రకారం సోష‌ల్ మీడియా మ‌ధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విట‌ర్ కోల్పోయింద‌ని  ఇకపై  భార‌త చ‌ట్టాల ప‌రంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశాయి

ఇప్పటివరకు ట్విట్టర్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఐటీ మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. పదే పదే హెచ్చరించినప్పటికి కూడా సంస్థ ఎటువంటి దృఢమైన చర్యలు తీసుకోలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి సంబంధించిన కొత్త నిబంధనలను పాటించడానికి చివరి అవకాశం ఇస్తున్నట్లు ప్రభుత్వం జూన్ 5న ట్విట్టర్‌కు ఇచ్చిన తుది నోటీసులో పేర్కొంది.  కొత్త ఐ‌టి  నిబంధనలను వెంటనే పాటించాలి అలా చేయడంలో విఫలమైతే ఐటి చట్టం ప్రకారం సోష‌ల్ మీడియా మ‌ధ్యవర్తిగా ఉండాల్సిన రక్షణను ట్విట‌ర్ కోల్పోయింద‌ని  ఇకపై  భార‌త చ‌ట్టాల ప‌రంగా చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశాయి

57

అయితే భారతదేశంలో తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ ఈ వివరాలను భారత సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో ఇంకా పంచుకోలేదు. వివరాలను త్వరలో ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకోనుట్లు ఈ ప్రక్రియ  ప్రతి దశలో జరిగే పరిణామాల గురించి ఐటి మంత్రిత్వ శాఖకు తెలియజేస్తున్నాము. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ట్విట్టర్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది అని అన్నారు.

అయితే భారతదేశంలో తాత్కాలిక చీఫ్ కంప్లైయెన్స్ ఆఫీసర్‌ను నియమించినట్లు ట్విట్టర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ ఈ వివరాలను భారత సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖతో ఇంకా పంచుకోలేదు. వివరాలను త్వరలో ఐటీ మంత్రిత్వ శాఖతో పంచుకోనుట్లు ఈ ప్రక్రియ  ప్రతి దశలో జరిగే పరిణామాల గురించి ఐటి మంత్రిత్వ శాఖకు తెలియజేస్తున్నాము. కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా ట్విట్టర్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది అని అన్నారు.

67

కొత్త నిబంధనల ప్రకారం మొదటి కేసు నమోదు  
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్‌పై కేసు నమోదు చేశారు. కొత్త ఐటి నిబంధనల ప్రకారం నమోదైన మొదటి కేసు ఇది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ సంఘటన వీడియో నిజం తెలియకుండానే ట్విట్టర్‌లో వైరల్ అయ్యిందని, ఇంకా ట్రెండింగ్‌గా మారిందని ఆరోపించారు. ఈ కేసులో మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు పలు సెక్షన్ కింద పోలీసులు కేసు విధించారు.
 

కొత్త నిబంధనల ప్రకారం మొదటి కేసు నమోదు  
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన ఘటనకు సంబంధించి ఘజియాబాద్ పోలీసులు ట్విట్టర్‌పై కేసు నమోదు చేశారు. కొత్త ఐటి నిబంధనల ప్రకారం నమోదైన మొదటి కేసు ఇది. బాధితుడు తప్పుడు సమాచారమని వివరించినా ట్విటర్ చర్య తీసుకోలేదని ఆరోపించారు. త‌ప్పుదోవ ప‌ట్టించే స‌మాచారాన్ని ట్విట‌ర్ తొల‌గించ‌లేద‌ని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ సంఘటన వీడియో నిజం తెలియకుండానే ట్విట్టర్‌లో వైరల్ అయ్యిందని, ఇంకా ట్రెండింగ్‌గా మారిందని ఆరోపించారు. ఈ కేసులో మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు పలు సెక్షన్ కింద పోలీసులు కేసు విధించారు.
 

77

ట్విటర్‌కు మరోసారి నోటీసులు
సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా ట్విటర్‌కు నోటీసులిచ్చింది. జూన్ 18 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది.  మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్‌  నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ  ఇవ్వాలని ఆదేశించింది. 

ట్విటర్‌కు మరోసారి నోటీసులు
సోషల్ మీడియా, ఆన్‌లైన్ వార్తలను దుర్వినియోగంపై కమిటీ తాజా ట్విటర్‌కు నోటీసులిచ్చింది. జూన్ 18 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంటు కాంప్లెక్స్‌లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని తెలిపింది.  మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతతో పాటు, ఫేక్‌న్యూస్‌  నివారణపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరణ  ఇవ్వాలని ఆదేశించింది. 

click me!

Recommended Stories