పెగసాస్ వాడకంపై పార్లమెంటులో ఐటి మంత్రి వివరణ.. దీనిపై ఎటువంటి ఆధారాలు లేవని వెల్లడి..

First Published Jul 19, 2021, 6:34 PM IST

పార్లమెంటు  సమావేశానికి ఒక రోజు ముందు  కొంతమంది ఫోన్ డేటాను కాంప్రోమైజ్ చేయడానికి అక్రమంగా స్పైవేర్ పెగాసస్‌ను ఉపయోగించారనే ఆరోపణలపై పత్రికా నివేదికలు యాదృచ్చికం కాదని సమాచార సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం అన్నారు.స్పైవేర్ పెగాసస్ వాడకంపై లోక్ సభలో ఒక ప్రకటన చేస్తూ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏవిధమైనా అక్రమ నిఘా సాధ్యం కాదని స్పష్టం చేశారు.
 

50వేల ఫోన్ నంబర్ల లీకైన డేటాబేస్ కు కన్సార్టియంకు అక్సెస్ లభించిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయని ఆయన అన్నారు. అయితే ఈ ఫోన్ నంబర్లతో అనుసంధామై ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టారని ఆరోపణ. ఏదేమైనా లీకైనా డేటాలో ఫోన్ నంబర్ ఉండటం వల్ల ఒక డివైజ్ పెగసాస్ బారిన పడిందా లేదా హాక్‌ గురైందా లేదా అనేది వెల్లడించలేదని నివేదిక పేర్కొంది. "ఫోన్ నంబర్ ఉండటం అనేది నిఘా పెట్టడం సమానం కాదని నివేదిక స్పష్టం చేస్తుంది" అని ఆయన చెప్పారు.
undefined
వాస్తవాల వెలుగులో సమస్యను పరిశీలించాలని పార్లమెంటు సభ్యులను కోరిన వైష్ణవ్, "ప్రభుత్వంలో సంవత్సరాలుగా ఉన్న ప్రతిపక్షంలోని నా సహచరులు ప్రోటోకాల్స్ గురించి తెలుసు అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఏ విధమైన అక్రమ నిఘా కూడా సాధ్యం కాదని వారికి తెలుసు. అని అన్నారు."భారతదేశంలో జాతీయ భద్రత కొరకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చట్టబద్ధమైన ఇంటెర్సెప్షన్ స్థాపించింది, ప్రత్యేకించి ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా భద్రత కొరకు కేంద్రం, రాష్ట్రంలోని ఏజెన్సీలను కోర్ట్ ఆర్డర్లపై అనుమతిస్తాయి.
undefined
ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఈ చట్టబద్ధమైన ఇంటెర్సెప్షన్ కోసం అభ్యర్థనలు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885లోని సెక్షన్ 5 (2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 69లోని నిబంధనల ప్రకారం చేయబడింది "అని ఆయన చెప్పారు."ఇంటెర్సెప్షన్ లేదా మానిటరింగ్ కేసును కాంపిటెంట్ అథారిటీ ఆమోదిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలలోని కాంపిటెంట్ అథారిటీ ఐటి (ప్రొసీజర్ అండ్ సేఫ్‌గార్డ్స్ ఫర్ ఇంటర్‌సెప్షన్, మానిటరింగ్ అండ్ డిక్రిప్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) రూల్స్, 2009 ప్రకారం ఈ అధికారాలను కలిగి ఉంది" అని వైష్ణవ్ తెలిపారు.
undefined
"పబ్లిషర్ జాబితాలోని నంబర్లు నిఘాలో ఉన్నాయో లేదో చెప్పలేమని నివేదిక ప్రచురణకర్త పేర్కొన్నారు. వారి టెక్నాలజి ఉపయోగించిన సంస్థ ఈ వాదనలను పూర్తిగా ఖండించింది. మన దేశంలో టైం టెస్టెడ్ ప్రక్రియలు నిర్ధారించడానికి బాగా స్థాపించబడ్డాయి అలాగే అక్రమ నిఘా జరిగే అవకాశం లేదు, "అని మంత్రి చెప్పారు.
undefined
click me!