కోహ్లీ సేనతో అత్యంత సన్నిహితంగా... ఆ అందాల భామ ఎవరంటే

First Published Oct 1, 2020, 11:41 AM IST

కరోనా కారణంగా దాదాపుగా ఈ ఏడాది ఆరంభం నుండి ఎలాంటి మ్యాచులు లేకుండా దిగాలుగా వున్న క్రికెట్ ప్రియుల్లో ఐపిఎల్ జోష్ పెంచింది ఐపిఎల్. 

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్...ప్రస్తుతం కరోనా విజృంభణతో ఎలాంటి ఎంటర్‌టైన్ మెంట్ లేకుండా చప్పగా సాగుతున్న జీవితాల్లో ఒక్కసారిగా మజాను నింపిన బిగ్ ఈవెంట్. ఇక దాదాపుగా ఈ ఏడాది ఆరంభం నుండి ఎలాంటి మ్యాచులు లేకుండా దిగాలుగా వున్న క్రికెట్ ప్రియుల్లో ఐపిఎల్ జోష్ పెంచింది. అయితే ఈ ఐపిఎల్ సీజన్ లో ఒక్కటే లోటు కనిపిస్తొంది. అభిమానుల కేరింతలు, అందమైన అమ్మాయిలతో కిక్కిరిసిపోయే మైదానాల్లోని సీట్లు ఖాళీగా కనిపించడం.
undefined
అయితే ఈ లోటును తీర్చడానికి అన్నట్టుగా ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో ఓ మహిళ బెంగళూరు జట్టుతో కనిపించింది. దీంతో ఆమె ఎవరా అన్న ఉత్కంఠ అభిమానుల్లో మొదలయ్యింది. ఆర్సిబి జెర్సీతో దర్శనమిచ్చిన ఆమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అభిమానులు.
undefined
ముంబై ఇండియన్స్ పై సూపర్ ఓవర్ ద్వారా విజయాన్ని అందుకున్న ఆర్సీబీ ఆటగాళ్ళను అభినందిస్తూ కనిపించింది యువతి. ఆటగాళ్ల భుజం తడుతూ సన్నిహితంగా వున్న ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం అభిమానులు చేస్తుండగానే ఆర్సిబి యాజమాన్యం ఆ రహస్య మహిళ గురించి బయటపెట్టింది.
undefined
తమ జట్టుతో కనిపించిన యువతి పేరు నవనీత గౌతమ్. ఆమె బెంగళూరు జట్టు ఆటగాళ్ల మసాజ్ థెరపిస్ట్ అట. దుబాయ్ లో ఆర్సిబి ఆటగాళ్లకు మసాజ్ చేయనుంది.
undefined
ఐపిఎల్ చరిత్రలోనే మొదటిసారిగా ఓ మహిళ సహాయక సిబ్బందిగా పనిచేయడం ఇదే మొదటిసారి. ఇలా ఐపిఎల్ లో మొదటి మహిళా స్టాఫ్ గా నిలిచారు నవనీత గౌతమ్.
undefined
నవనీత్ ఆర్సిబి హెడ్ ఫిజియో ఇవాన్ మరియు కోచ్ శంకర్ బసుతో కలిసి పనిచేయనున్నారు. ఇలా ఆర్సిబి కోసం ఓ మహిళా థెరపిస్ట్ ను నియమించినట్లు ఐపిఎల్ ఛైర్మన్ ఇప్పటికే ప్రకటించారు.
undefined
click me!