15రోజులుగా సెక్స్ కి దూరం పెట్టిన భార్య... కోపంతో భర్త ఏం చేశాడంటే..

First Published May 27, 2021, 11:20 AM IST

సెక్స్ కోసం భర్త పరితపిస్తున్నా.. పట్టించుకోలేదు. భార్య అలా తనను దూరం పెట్టడం అతనికి ఏ మాత్రం నచ్చలేదు. అంతే.. ఉన్మాదిలా మారిపోయాడు.

భార్యతో సంతోషంగా గడపాలని అతను ఆశపడ్డాడు. అయితే.. ఆ భార్య మాత్రం భర్తను దూరం పెడుతూ వస్తోంది. 15 రోజుల నుంచి కనీసం భర్తను పక్కకి రానివ్వడం లేదు. సెక్స్ కోసం భర్త పరితపిస్తున్నా.. పట్టించుకోలేదు. భార్య అలా తనను దూరం పెట్టడం అతనికి ఏ మాత్రం నచ్చలేదు. అంతే.. ఉన్మాదిలా మారిపోయాడు.
undefined
భార్య దూరం పెట్టడం నచ్చని అతను ఏకంగా భార్యను చంపేశాడు. తన ముగ్గురు పిల్లలను కూడా సమీపంలోని ఓ కెనాల్ లో కి తోసేశాడు. ఈ సంఘటన ముజఫర్ నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
undefined
ముజఫర్ నగర్ జిల్లా మన్సూర్ పూర్ ప్రాంతంలోని జీవన గ్రామానికి చెందిన డోలి కి 12 సంవత్సరాల క్రితం పెళ్లైంది. అయితే.. పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకే డోలి భర్త మోను ప్రమాదవశాత్తు చనిపోయాడు. దీంతో.. డోలికి దేవర్ పప్పు అనే వ్యక్తితో రెండో వివాహం జరిపించారు.
undefined
వీరికి ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. సంతోషంగానే గడుపుతున్నారు. అయితే.. గత 15 రోజులుగా డోలి.. భర్త దేవర్ పప్పును దూరం పెడుతూ వస్తోంది. అతను బతిమిలాడినా.. బెదిరించినా ఆమె పట్టించుకోలేదు. దీంతో.. దేవర్ పప్పు కోపంతో రగిలిపోయాడు. ఈ కోపంలోనే మంగళవారం ఉదయం భార్యను చంపేశాడు.
undefined
భార్యను చంపిన తర్వాత తన ముగ్గురు పిల్లలు సానియా(5), వన్ష్(3), హర్షిత( సంవత్సరన్నర) లను తీసుకొని పరారయ్యాడు.
undefined
అయితే.. ముగ్గురు పిల్లలను తీసుకొని వెళితే.. పోలీసులకు తొందరగా దొరికిపోతానేమోననే భయంతో.. ముగ్గురు పిల్లలను దగ్గరలోని ఓ కెనాల్ లో తోసేశాడు.
undefined
అనంతరం అక్కడి నుంచి పారిపోతూ పోలీసులకు దొరికిపోయాడు. కాగా..కెనాల్ లోని ముగ్గురు చిన్నారుల మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
undefined
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
undefined
click me!