Ration Card: దేశవ్యాప్తంగా ఉన్న పేదలకు కేంద్ర ప్రబుత్వం రేషన్ వ్యవస్థ ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవస్థలో కీలక మార్పు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోందని తెలుస్తోంది.
రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు ఉచితంగా అందుతున్న బియ్యం, గోధుమల స్థానంలో ఇకపై నేరుగా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో లబ్ధిదారులకు ఎంపిక స్వేచ్ఛ లభించనుంది.
25
ఆహార ధాన్యాల స్థానంలో నగదు జమ
ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు సరఫరా చేస్తున్నారు. అయితే కొందరు లబ్ధిదారులు ఈ సరుకులు తీసుకోకపోవడం లేదా అక్రమంగా విక్రయిస్తారన్న వాదన నడుస్తోంది. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇకపై లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని జమ చేయనుంది.
35
పైలట్ ప్రాజెక్టుగా అమలు
ఈ కొత్త విధానాన్ని ఒకేసారి దేశవ్యాప్తంగా అమలు చేయకుండా ముందుగా కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. చండీగఢ్, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నిర్వహించారు. ఈ అనుభవం ఆధారంగా పూర్తి స్థాయి అమలుకు కేంద్రం సిద్ధమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ సహకారంతో ఈ-రూపీ అనే డిజిటల్ వోచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. లబ్ధిదారుల మొబైల్ నంబర్కు ప్రతి నెలా వోచర్ రూపంలో నగదు జమ అవుతుంది. ఈ వోచర్తో రేషన్ దుకాణంలో బియ్యం, గోధుమలు తీసుకోవచ్చు. అవసరమైతే బ్యాంక్ ఖాతా ద్వారా నగదుగా కూడా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంటుంది.
55
నకిలీ కార్డులకు చెక్ పెట్టడమే లక్ష్యం
ఈ కొత్త విధానం ప్రధాన ఉద్దేశ్యం నకిలీ రేషన్ కార్డులను తొలగించడం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 76 వేలకుపైగా డుప్లికేట్ కార్డులను గుర్తించారు. నగదు బదిలీ విధానం అమలులోకి వస్తే బ్లాక్ మార్కెట్ వ్యవహారాలకు పూర్తిగా చెక్ పడనుంది. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం చేరే విధంగా ఈ మార్పు ఉండనుంది.