సీఎం ప్రకారం, ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 853, డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అవుతుంది. పీఎన్జీ కనెక్షన్లు వాడే రేషన్ కార్డు హోల్డర్లు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందుతారు. రోజురోజుకు పెరుగుతున్న వంట గ్యాస్ ధరల నుచి పేదలకు కొంత ఉపశమనం ఇవ్వడానికి ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకానికి అర్హులైన వారికి మాత్రమే సిలిండర్ అందుతుంది. ముఖ్యంగా మహిళల పేరు మీద ఉన్న గ్యాస్ కనెక్షన్లకు త్వరగా పథకం వర్తిస్తుంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డు, రేషన కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలు అవసరం అవుతాయి.