ప్రత్యేక మార్గంలో ఇజ్రాయెల్ చేరుకున్న మోదీ విమానం.. ఆ దేశాల‌ను పూర్తిగా త‌ప్పించారు

Published : Feb 26, 2026, 11:19 AM IST

PM Modi: ప్రధాని న‌రేంద్ర మోదీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌నను ప్ర‌పంచం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. తొమ్మిదేళ్ల త‌ర్వాత ఇజ్రాయెల్ వెళ్లిన మోదీ ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం 

PREV
15
ప్రపంచంలోనే ఎక్కువ మంది ట్రాక్ చేసిన విమానం

ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేసిన ఫ్లైట్‌గా నిలిచింది. బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో విమానం జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు ఒకేసారి సుమారు 9,000 మందికిపైగా ఆన్‌లైన్‌లో ఈ ఫ్లైట్‌ను గమనించారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

25
ప్రత్యేక మార్గంలో ఇజ్రాయెల్ చేరుకున్న విమానం

ప్రధాని విమానం సాధారణ మార్గాన్ని కాకుండా ప్రత్యేక రూట్‌లో ప్రయాణించింది. భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్, ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తప్పించింది. మోదీ విమాన ప్ర‌యాణ మార్గం ఇలా సాగింది.

* మొద‌ట ఢిల్లీలోని పలం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరింది. గుజరాత్ మీదుగా ప్రయాణించింది.

* అనంత‌రం అరేబియా సముద్రం దాటింది.

* అలా ఒమాన్ చేరుకుంది.

* అక్కడి నుంచి సౌదీ అరేబియా గగనతలంలో ప్రయాణించింది

* తరువాత జోర్డాన్ మీదుగా వెళ్లింది

* చివరకు ఇజ్రాయెల్‌లో దిగింది. విమానం బెన్ గురియ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది.

సాధారణంగా భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు నేరుగా ప్రయాణిస్తే 6–7 గంటలు పడుతుంది. అయితే ఈసారి ప్రత్యేక మార్గం కారణంగా ప్రయాణ సమయం కొద్దిగా పెరిగింది.

35
ప్రత్యేక విమానం – ఎయిర్ ఇండియా వన్

ప్రధాని మోదీ ఎయిర్ ఇండియా వన్ అనే ప్రత్యేక ప్రభుత్వ విమానంలో ప్రయాణించారు. ఇది సాధారణ విమానం కాదు. ఈ విమానం సాధారణంగా Boeing 777-300ER మోడల్‌పై రూపొందించారు. ఇందులో సురక్షిత కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రత్యేక కమాండ్ సెంటర్, రక్షణ పరికరాలు, అధిక భద్రతా సదుపాయాలు ఉంటాయి. ప్రధానితో పాటు ఇతర ప్రముఖుల అధికారిక విదేశీ పర్యటనలకు ఈ విమానం ఉపయోగిస్తారు.

45
9 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ పర్యటన

ప్రధాని మోదీకి ఇది రెండో ఇజ్రాయెల్ పర్యటన. ఆయన మొదటిసారి 2017 జూలైలో ఇజ్రాయెల్ వెళ్లారు. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మోదీ ఇజ్రాయెల్ వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజ‌మిన్ నెత‌న్యాహుతో స‌మావేశ‌మ‌య్యారు. అలాగే ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్ర‌సంగించారు. ఇక ఈ పర్యటనలో భారత్–ఇజ్రాయెల్ మధ్య రక్షణ సహకారం ప్రధాన అంశంగా ఉండ‌నుంది. ఇందులో భాగంగా డ్రోన్లు, క్షిపణి నిరోధక వ్యవస్థలు, ఆధునిక రక్షణ సాంకేతికత, విషయాలపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

55
ఇజ్రాయెల్ మీడియా ఘన స్వాగతం

ఇజ్రాయెల్ ప్రముఖ పత్రిక The Jerusalem Post ప్రధాని మోదీ పర్యటనకు ప్రత్యేక స్వాగతం పలికింది. ఫ్రంట్ పేజీలో మోదీ ఫోటో ప్రచురించి. "నమస్తే" (హిందీ), "షాలోమ్" (హీబ్రూ) అనే పదాలతో స్వాగతం తెలిపింది. ఈ రెండు పదాల అర్థం "హలోష‌.

ప్రపంచ దృష్టి ఎందుకు ఆకర్షించింది?

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై అంత ఆసక్తి రావడానికి ముఖ్య కారణాలు. ప్రత్యేక విమాన మార్గం, భద్రతా ఏర్పాట్లు, రక్షణ ఒప్పందాల అవకాశాలు, అంతర్జాతీయ రాజకీయ ప్రాధాన్యం వంటి కార‌ణాల వ‌ల్ల మోదీ ప్రయాణించిన విమానం ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేసిన ఫ్లైట్‌గా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories