Love Marriage: లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లకు షాక్.. ఇకపై పేరెంట్స్‌కు చెప్పకుండా పెళ్లి కుదరదు

Published : Feb 22, 2026, 06:32 AM IST

Love Marriage: ప్రేమించుకుని, లేచిపోయి పెళ్లి చేసుకునే జంటలకు ఇకపై కొత్త రూల్ రాబోతోంది. ఇకపై పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే, కచ్చితంగా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాల్సిందే. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో ఈ రూల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు.

PREV
14
లేచిపోయి పెళ్లిచేసుకునే వారికి బిగ్ షాక్

తమన ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోతే చాలు… ఇంట్లో నుంచి తల్లిదండ్రులకు చెప్పకుండా వచ్చేస్తాయి ప్రేమ జంటలు. స్నేహితుల సాయంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. లేదా ఆర్య సమాజ్ వంటి చోట్ల పెళ్లి చేసుకుంటారు. రిజిస్ట్రార్ ఆఫీసులో నలుగురు సాక్షుల సంతకాలతో పెళ్లి తంతు ముగిస్తారు. కానీ ఇకపై ఇలా కుదరదు. లేచిపోయి పెళ్లి చేసుకోవచ్చు.. కానీ తల్లిదండ్రులకు చెప్పడం తప్పనిసరి. లేదంటే వీరి పెళ్లి రిజిస్టర్ కాదు. ఈ నియమాన్ని గుజరాత్ లో అమలు చేయాలని అధికార యంత్రాంగం ఆలోచిస్తోంది.

24
త్వరలో అమల్లోకి

ప్రస్తుతం ఈ కొత్త రూల్ ఇంకా అమల్లోకి రాలేదు. త్వరలో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గుజరాత్ వివాహ రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి అసెంబ్లీలో ప్రకటించారు. 'మీ ప్రేమ నిజమైతే ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. తల్లిదండ్రులకు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు' అని ఆయన అన్నారు.

34
డిక్లరేషన్ తప్పనిసరి

ప్రేమించి లేదా లేచిపోయి పెళ్లి చేసుకోవాలనుకునే జంట  తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలి. అలా ఇచ్చినట్టు ఓ డిక్లరేషన్ ఇవ్వాలి. తల్లిదండ్రుల అడ్రస్, ఆధార్ కార్డ్ వివరాలు, ఫోన్ నంబర్ వంటివి అధికారులకు ఇవ్వాలి. పెళ్లికి సాక్షులుగా ఉండేవారు కూడా తమ ఆధార్ వివరాలు, డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఇవ్వాలి. తల్లిదండ్రులకు పెళ్లి విషయం తెలియకపోతే పెళ్లి రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది. అంటే పెళ్లే జరగదు.

44
మతమార్పిడి పెళ్లిళ్లను ఆపడానికే

ఈ విషయంపై గుజరాత్ ప్రభుత్వం మాట్లాడుతూ తాము ప్రేమకు అడ్డుకాదని , కానీ ప్రేమ పేరుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని ఆపడానికే మా ప్రయత్నం అని చెబుతోంది. అంతే కాాదు ప్రేమ పేరుతో నాటకాలు ఆడదుతూ మత మార్పిడిలు చేయడం వంటివి కూడా జరుగుతున్నాయని వాటిని అడ్డుకునేందుకు ఇలాంటి చట్టాలు చేస్తున్నామని వివరిస్తోంది. 

రిజిస్ట్రేషన్ ఆఫీసుకు చేరుకున్నపెళ్లి జంట పెళ్లికి  దరఖాస్తు చేసుకోవాలి. అధికారి ఆ దరఖాస్తును సంబంధిత జిల్లా లేదా తాలూకాకు పంపిస్తారు. అక్కడ అధికారులు అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా లేదా అని పరిశీలిస్తారు. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి  30 రోజులు పడుతుంది. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పామని అబద్ధం చెబితే, వాళ్లు ఫిర్యాదు చేస్తే కిడ్నాప్ కేసు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పటికప్పుడు పెళ్లిళ్లు జరిగే ఛాన్స్ లేదు. 

Read more Photos on
click me!

Recommended Stories