తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ప్రభావం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన మార్గాలైన హైదరాబాద్ నుంచి తిరుపతి, విశాఖపట్నం వెళ్లే వారిపై ఈ పెంపు ప్రభావం ఎలా ఉంటుందో కింది అంచనాల ద్వారా తెలుసుకోవచ్చు:
1. హైదరాబాద్ - తిరుపతి (సుమారు 660 కి.మీ):
జనరల్ టికెట్: 215 కి.మీ మినహాయింపు పోను, మిగిలిన 445 కిలోమీటర్లకు (445 x 1 పైసా) సుమారు రూ. 4.50 పెరుగుతుంది.
స్లీపర్/ఏసీ: మొత్తం దూరానికి (660 x 2 పైసలు) రూ. 13.20 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది.
2. హైదరాబాద్ - విశాఖపట్నం (సుమారు 700 కి.మీ):
జనరల్ టికెట్: 215 కి.మీ మినహాయింపు పోను, మిగిలిన 485 కిలోమీటర్లకు రూ. 5 వరకు పెరుగుతుంది.
స్లీపర్/ఏసీ: మొత్తం దూరానికి (700 x 2 పైసలు) సుమారు రూ. 14 వరకు టికెట్ ధర పెరిగే అవకాశం ఉంది.
గమనిక: ఇవి అంచనాలు మాత్రమే అసలైన ధరల పూర్తి వివరాలు రైల్వే వెల్లడిస్తుంది.