ఢిల్లీ ఎన్సీఆర్ : చలి తీవ్రత పెరగగా, కాలుష్యం పరిస్థితిని మరింత దిగజార్చింది. నవంబర్ 22న కనిష్ట ఉష్ణోగ్రత 10–12°C, 23న మరో 1–2°C తగ్గే అవకాశం ఉంది..
జార్ఖండ్ : రాత్రి ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా 2 డిగ్రీలు పెరిగే అవకాశం. 23వ తేదీ నుండి మళ్లీ తగ్గుదల ఉంటుంది. 26–27న తీవ్ర చలి ఉంటుంది.
యూపీ : కొన్ని చోట్ల దట్టమైన పొగమంచు ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 9–13°C మధ్య, గరిష్ఠం 25–28°C మధ్య ఉంటాయి.
రాజస్థాన్, బీహార్ : బీహార్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి తీవ్రత అధికం అయింది. పొగమంచు, చలి గాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్లో కూడా తీవ్ర శీతల వాతావరణం నమోదైంది.
నవంబర్ 25 వరకు వేగంగా వీచే గాలుల, తుపాను ప్రభావం కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని ఐఎండీ సూచించింది. తుపాను సేన్యార్ ప్రభావం వచ్చే వారం వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.