అమిత్ షా : ఢిల్లీ బ్లాస్ట్ వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం.. హైదరాబాద్ లో హై అలర్ట్

Published : Nov 10, 2025, 10:15 PM IST

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమిత్ షా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు.

PREV
13
ఢిల్లీ పేలుడు ఘటనతో దేశం షాక్‌

దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన భయానక పేలుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పార్క్ చేసిన i20 కారులో పేలుడు సంభవించడంతో 13 మంది మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటన సాయంత్రం 6.52 గంటలకు జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది.

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, పేలుడు తర్వాత రోడ్డుపై మానవ శరీర భాగాలు చెల్లాచెదురుగా కనిపించాయి. స్థానికులు ఆ దృశ్యాలను చూసి షాక్‌కు గురయ్యారు. గాయపడిన వారిని సమీపంలోని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏమన్నారంటే?

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసర చర్యలు చేపట్టారు. ‘‘ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుగుతుంది. వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం’’ అని ఆయన తెలిపారు.

అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఫోరెన్సిక్ బృందాలు సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నాయి. ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

23
బాధితులను పరామర్శించిన అమిత్ షా

హోంమంత్రి అమిత్ షా గాయపడిన వారిని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో స్వయంగా కలిశారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పేలుడు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. “ప్రజల భద్రతే మా ప్రాధాన్యం. ఈ దాడి వెనుక ఉన్న వారిని వదిలిపెట్టం” అని షా స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అమిత్ షాతో మాట్లాడి, ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. దేశ భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

33
హైదరాబాద్ లో హై అలర్ట్‌.. ముమ్మర తనిఖీలు

ఢిల్లీ పేలుడు ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రిత్వశాఖ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు నగరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీ.వి. ఆనంద్ సజ్జనార్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేయాలని, అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.

దర్యాప్తులో ఎన్‌ఐఏ, ఎన్‌ఎస్‌జీ బృందాలు

ఢిల్లీ పేలుడు దర్యాప్తులో ఎన్‌ఐఏ (National Investigation Agency), ఎన్‌ఎస్‌జీ (National Security Guard) బృందాలు రంగంలోకి దిగాయి. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి సాక్ష్యాధారాలను సేకరిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో పేలుడు పదార్థం కారు వెనుక భాగంలో అమర్చినట్లు తెలుస్తోంది.

ఫోరెన్సిక్ నిపుణులు కారులో ఉపయోగించిన పేలుడు పదార్థం రకం, రిమోట్ యాక్టివేషన్ సాధ్యాసాధ్యతలపై పరిశీలిస్తున్నారు. అదనంగా, స్థానిక సీసీటీవీ ఫుటేజీలలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అతడిని విచారణకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read more Photos on
click me!

Recommended Stories