పుచ్చిపోయిన పళ్లు ఉన్నవారికి పంటి నొప్పి రావడం సర్వ సాధారణం. అయితే ఈ నొప్పి పెరుగుతూనే ఉంటుంది. అయితే ఈ పంటి నొప్పిని తగ్గించడానికి ఉప్పు నీళ్లు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇది చాలా సింపుల్ చిట్కా. దీనికోసం మీరు రూపాయి కూడా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు. పంటి నొప్పి మరీ ఎక్కువైనప్పుడు ఉప్పు కలిపిన నీళ్లతో పుక్కిలించండి. నోటిని కడగండి. దీనివల్ల పంటిలోని పురుగులు నశిస్తాయి. అలాగే మీ నోరు, చిగుళ్లు ఆరోగ్యంగానూ ఉంటాయి. నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.