Monsoon Diet Tips: వర్షాకాలంలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ టైంలో ఇమ్యూనిటీ పెంచుకోవడం అవసరం. వర్షా కాలంలో కేవలం కడుపు నింపే ఆహారం కాకుండా, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలను డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
వర్షా కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. తేమ ఎక్కువగా ఉండటం, బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపించడం, కలుషితమైన నీరు లేదా ఆహారం వల్ల ఇబ్బందులు రావడం ఇందుకు ప్రధాన కారణాలు. ఈ కాలంలో కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచే, జీర్ణక్రియకు మేలు చేసే, శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహారాలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.
26
సీజనల్ ఫ్రూట్స్
వర్షాకాలంలో జామ, దానిమ్మ, యాపిల్, బొప్పాయి వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా జామలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది.
36
ఆకుకూరలు, తాజా కూరగాయలు
పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్, విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె వంటి అనేక పోషకాలు ఉంటాయి. క్యారెట్, బీన్స్, బీట్రూట్, సొరకాయ వంటి కూరగాయలు కూడా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి. అయితే వర్షాకాలంలో కూరగాయలు, ఆకుకూరలపై మట్టి, సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని శుభ్రంగా కడిగి, బాగా ఉడికించి తినడం మంచిది.
కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా వంటి పప్పుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర కణాల మరమ్మతులకు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తాయి. గుడ్లు, చేపలు లేదా చికెన్ వంటి ప్రోటీన్ ఆహారాలు తీసుకునేవారు అవి పూర్తిగా ఉడికిన తర్వాత తినడం మంచిది.
56
పెరుగు
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే కొందరికి చల్లటి పెరుగు కడుపులో అసౌకర్యం కలిగించవచ్చు. అలాంటి వారు గది ఉష్ణోగ్రతలో ఉన్న పెరుగును పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.
66
వేడి సూప్ లు
వర్షా కాలంలో వేడి సూప్లు, పప్పు చారు, రసంతో పాటు అల్లం, వెల్లుల్లి, పసుపు వంటి పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే ఈ కాలంలో దాహం తక్కువగా అనిపించినా తగినంత నీరు తాగడం అవసరం. వేడి నీరు, సూప్లు, మజ్జిగ వంటి పానీయాలను కూడా అవసరానికి అనుగుణంగా తీసుకోవచ్చు.