- చికెన్ను శుభ్రంగా కడిగి ముందుగా మారినేట్ చేయాలి. ఇందుకోసం చికెన్ ఒక గిన్నెలో వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
- మసాలాలన్నీ చికెన్కు పట్టేందుకు అరగంట పాటూ మూత పెట్టి అలా వదిలేయండి.
3. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో శనగపిండి, కార్న్ ఫ్లోర్, వాము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేయండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని బాగా కలపండి.
3. ఇప్పుడు ముందుగా మారినేట్ చేసిన చికెన్ ముక్కలను ఈ పిండిలో కూడా వేసి వాటికి పిండిగా బాగా పట్టేలా చూడాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కా చికెన్ ముక్కలను అందులో వేసుకోవాలి.
5. ఆ ముక్కలు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి. పకోడీలు సరిగ్గా వేగాలంటే, ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకండి.
6. ఈ చికెన్ పకోడీని పుదీనా లేదా కొత్తిమీర చట్నీతో తింటే అదిరిపోతాయి.