Grand Children Gifts: మన దేశంలో చాలా మంది అపర కుబేరులు ఉన్నారు.వారు తమ మనవళ్లు,మనవరాళ్లు పుట్టిన సందర్భంగా అపురూపమైన, ఖరీదైన బహుమతులు అందించారు.పుట్టీ పుట్టగానే ఖరీదైన బహుమతులు అందుకున్న జూనియర్ కుబేరులు ఎవరో చూద్దాం..
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి , ఆయన భార్య సుధా మూర్తి గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. కోట్ల ఆస్తులకు అధిపతులు అయినప్పటికీ.. ఆ డాబు వీరు ఎప్పుడూ చూపించరు. చాలా సింపుల్ గా కనిపిస్తారు. అలాంటి జీవనమే సాగిస్తారు. అయితే.. అలాంటి ఈ దంపతులు తమ మనవడికి మాత్రం అత్యంత ఖరీదైన బహుమతిని అందించారు.
నారాయణ మూర్తి కుమారుడు రోహణ్ మూర్తి, కోడలు అపర్ణా కృష్ణలకు 2023 నవంబర్ 10న కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి ఏకగ్రహ అనే పేరు పెట్టారు. కాగా.. మనవడికి నాలుగు నెలల వయసు ఉన్నప్పుడే.. నారాయణ మూర్తి ఏకంగా 240 కోట్లు విలువ చేసే 15లక్షల ఇన్ఫోసిస్ షేర్లను రాసి ఇచ్చారు. నారాయణమూర్తి, సుధా మూర్తిలకు మూడో మనవడు కావడం విశేషం.
24
మనవళ్ల కోసం.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ..
ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు.. తమ ముద్దుల కుమార్తె ఇషా అంబానీ కి 2018 లో అంగ రంగ వైభవంగా వివాహం జరిపించారు. ఇషా అంబానీ 2022లో కృష్ణ, అదియా అనే కవలలకు జన్మనిచ్చారు. తాతయ్య, అమ్మమ్మ అయిన సందర్భంగా.. ఆనందంతో.. ముఖేష్ నీతాలు.. తమ మనవడు, మనవరాలి కోసం స్పెషల్ గా ఖరీదైన క్లోసెట్( దుస్తుల కబోర్డ్) తయారు చేయించారు. ఈ క్లోసెట్ ని దగ్గరుండి మరీ కస్టమైజ్ చేయించారు. దీనిపై మేఘాలు, విమానాలు వంటి అందమైన డిజైన్లు ఉంటాయి. అవి హెర్మెస్, డియోర్ వంటి లగ్జరీ బ్రాండెడ్ కంపెనీలతో చేయించడం విశేషం.
34
కోడలి కోసం నీతా అంబానీ..
నీతా అంబానీ తన మనవడు, మనవరాళ్లకు మాత్రమే కాదు.. కోడలు కోసం కూడా ఖరీదైన బహుమతి ఇచ్చారు. 2019 లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి శ్లోకా మెహతాతో జరిగింది. ఆ సమయంలో.. కోడలిని నీతా అంబానీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు.రూ.451 కోట్లు విలువ చేసే నక్లెస్ ని ఇచ్చారు.
ముకేష్ అంబానీ ముద్దుల కుమార్తె ఇషా అంబానీ వివాహం 2018లో ఆనంద్ పెరుమాల్ తో జరిగింది. పెరుమాల్ కుటుంబం కూడా బిలీనియర్ల ఫ్యామిలీనే. అందుకే.. వీరి పెళ్లి సందర్భంగా ఆనంద్ పెరుమాల్ పేరెంట్స్.. తమ కోడలు ఇషా కోసం.. ఖరీదైన లగ్జరీ ఇంటిని బహుమతిగా ఇచ్చారు. దీని ఖరీదు రూ.450 కోట్లు కావడం విశేషం.