భారత వాణిజ్యశాఖ అంచనాల ప్రకారం 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ఈ సుంకాల ప్రభావానికి లోనవుతాయి. ముఖ్యంగా జౌళి వస్తువులు, రెడీమేడ్ దుస్తులు, జెమ్స్, ఆభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర పరికరాలపై ప్రభావం తీవ్రంగా పడనుంది. అయితే ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులకు ఈ సుంకాలు వర్తించవు.