రోజుకు ఒక్కసారైన పండ్లు, కూరగాయలతో తయారుచేసిన స్మూతీలను తీసుకోవాలని, అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తెలిపారు.
ప్రయోజనాలు:
ఫైబర్ : పండ్లు, కూరగాయలతో చేసిన స్మూతీలను తీసుకోవడం వల్ల ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
విటమిన్లు, ఖనిజాలు: ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి.
డిటాక్సిఫికేషన్: బీట్ రూట్, పాలకూర, ఆపిల్, క్యారెట్ వంటి కూరగాయలు, పండ్లు లివర్ను డిటాక్స్ చేయడానికి, దాని పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి.