రోగనిరోధక శక్తి పెరుగుతుంది
శరీరంలో తగినంత నీళ్ళు ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయాన్నే నీళ్ళు తాగితే శరీరంలోని లింఫాటిక్ వ్యవస్థ బ్యాలెన్స్ అవుతుంది. ఇది వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంచుతుంది.
మెదడు పనితీరు మెరుగుపడుతుంది
మెదడు సరిగ్గా పనిచేయడానికి తగినంత నీళ్ళు అవసరం. ఉదయాన్నే నీళ్ళు తాగితే మెదడు చురుగ్గా, ఉత్సాహంగా ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.