ఆకుకూరల్లో మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నాడీ వ్యవస్థను శాంతింపజేసి, తలనొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా కీర, సెలెరీ, క్యారెట్ వంటి కూరగాయలతో రసం తయారుచేసుకుని తాగితే.. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. తలనొప్పి తగ్గుతుంది. ఇది సహజమైన, ఆరోగ్యకరమైన పరిష్కారం.