ఎండాకాలంలో పుచ్చకాయ మనకు విరివిగా దొరుకుతుంది. చూడటానికి ఎర్రగా, రుచికి తియ్యగా ఉంటుంది. అంతేకాదు.. ఇది 90 శాతం నీటితో నిండి ఉంటుంది. కాబట్టి.. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఈ పండు తినడం వల్ల శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. చాలా మంది ఎండాకాలంలో ఎప్పుడు పడితే అప్పుడు పుచ్చకాయ తింటూ ఉంటారు. కానీ, తప్పుడు సమయంలో, తప్పుగా తింటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని మీకు తెలుసా? మరి, ఈ పండును ఏ సమయంలో తినాలి? ఎలా తినాలి అనేది ఇప్పుడు చూద్దాం..