ఈ కుర్మాకు అసలైన రుచిని ఇచ్చేది మనం తయారుచేసే మసాలా పేస్ట్. ఇందుకోసం మిక్సీ జార్లో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తాజా మసాలా వాసన చికెన్ కర్రీ కంటే అద్భుతంగా ఉంటుంది.