సాధారణంగా అరటి పండును అందరు ఇష్టంగా తింటారు. అందుబాటు ధరలో దొరుకుతుంది. కాబట్టి ఎక్కువ మంది వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే అరటి.. పచ్చిగా ఉన్నప్పుడు తింటే మంచిదా? పండిన తర్వాత తింటే మంచిదా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.
అరటి పండు పచ్చిగా ఉన్నా, పండినా రెండూ ఆరోగ్యానికి మంచివేనట. పండిన అరటి సులభంగా జీర్ణమవుతుంది. కానీ పచ్చి అరటి మధుమేహం ఉన్నవాళ్లకి మంచిది. కాలేయానికి కూడా మేలు చేస్తుంది. అయితే ఏ అరటిలో పోషకాలు ఎక్కువ, ఏది ఎక్కువ ఉపయోగకరమో ఇప్పుడు తెలుసుకుందాం.