చేపలు, రొయ్యలు, ఎండు చేపలు వంటి సముద్ర ఆహారాలు తినేటప్పుడు పాలు, మజ్జిగ, పెరుగు వంటివి తినకూడదు. ఇది ఫుడ్ పాయిజనింగ్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పాలు జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి నాన్ వెజ్ తో పాలు, పాల పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ ఆమ్ల ఉత్పత్తి అవసరం. పాల ఉత్పత్తులు ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తాయి, దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. చేపల్లోని ప్రోటీన్లు, పాలలోని ప్రోటీన్లతో కలిసి కొంతమందికి అలెర్జీ, దురద వంటి సమస్యలు వస్తాయి.