ముందుగా మామిడిపండ్లను తొక్క తీసి ముక్కలుగా కోయాలి. వాటిని మిక్సీలో వేసి కొద్దిగా నీరు కలిపి స్మూత్ ప్యూరీలా చేసుకోవాలి. ఆ తర్వాత పాలు, కుంకుమపువ్వు, చక్కెర, యాలకుల పొడి, ఐస్ క్యూబ్స్ వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. ఇది క్రీమీగా, చల్లగా తయారవుతుంది. ఇంకా మంచి రుచి కోసం ఫ్రిజ్లో కొంతసేపు పెట్టుకోవచ్చు.
పూరీ తయారీ విధానం
గోధుమ పిండి, ఉప్పు, నూనె కలిపి నీరు కొద్దిగా పోస్తూ గట్టిగా పిండి కలుపుకోవాలి. ఈ పిండిని మూతపెట్టి 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి పలుచగా కాకుండా చిన్న డిస్క్లా వత్తాలి. వేడినూనెలో వేసి గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.