ఫ్రిజ్ కూడా అవసరం లేదు..
ఈ పొడిని వేరే దేశాలకు వెళ్లేటప్పుడు కూడా తీసుకెళ్లొచ్చు. ఇంట్లో ఫ్రిజ్ లో పెట్టకుండానే ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు.
ఈ పొడి తయారీకి ఒక కేజీ బియ్యం, 250 గ్రాముల మినపప్పు, 100 గ్రాముల అటుకులు మాత్రమే కావాలి. అన్నింటినీ కడిగి నీడలో ఆరబెట్టాలి. అవి బాగా ఆరిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. మీకు దోశ, ఇడ్లీ తినాలనిపించినప్పుడు, ఈ పొడిని నీళ్లలో కలిపి రాత్రి నానబెడితే, ఉదయానికి పిండి పులిసి సిద్ధంగా ఉంటుంది. ఈ పిండితో చేసిన దోశ-ఇడ్లీ చాలా రుచిగా ఉంటాయి.