రోజూ ఒకే రకం దోశ తింటే బోర్ కొడుతోందా? అయితే ఇలా కొత్తగా ట్రై చేయండి. దోశలు క్రిస్పీగా, రుచిగా ఉంటాయి. రెండు దోశలు తినలేని వాళ్లు కూడా నాలుగు తింటారు. ఇక పిల్లలైతే లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ క్రిస్పి దోశలు ఎలా తయారు చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలెంటో ఇక్కడ చూద్దాం.
బార్లీ చాలా పోషకాలతో కూడింది. అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. బార్లీ దోశ సాధారణ దోశ కంటే క్రిస్పీగా, రుచిగా ఉంటుంది. జీర్ణక్రియకు మంచిది. బాగా శక్తినిస్తుంది.
211
బార్లీ దోశకి కావాల్సినవి
బార్లీ - 1 కప్పు
మినుములు- 1/4 కప్పు
మెంతులు - 1/4 స్పూను
ఉప్పు - తగినంత
నూనె - తగినంత తీసుకోవాలి.
311
బార్లీ దోశ తయారీ
బార్లీ, మినుములు, మెంతులు 4-6 గంటలు నానబెట్టాలి. మెత్తగా నూరి, ఉప్పు కలిపి 8-10 గంటలు పక్కనపెట్టాలి. ఆ తర్వాత దోశ పెనం మీద పలుచగా వేసుకోవాలి.
బియ్యం, మెంతులు నానబెట్టి, తురిమిన కొబ్బరితో మెత్తగా నూరాలి. ఉప్పు కలిపి 6-8 గంటలు పులియబెట్టాలి. తర్వాత పెనం మీద పలుచగా దోశలు వేసుకోవాలి. వీటిని చట్నీ, సాంబారుతో తినచ్చు.
611
వేరుశనగ పిండి దోశ
వేరుశనగ పిండి దోశ మంచి పోషకాలతో కూడింది. త్వరగా తయారవుతుంది. పులియబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ.
సగ్గుబియ్యం నానబెట్టి, గరుకుగా నూరాలి. పిండి, రవ్వ, పెరుగు, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నీళ్లు కలిపి దోశ పిండి తయారు చేసుకోవాలి. దోశ పెనం మీద వేసి, నూనె వేసి కాల్చుకోవాలి. చట్నీ, సాంబారుతో తినచ్చు.