రాత్రికి రాత్రే మారిన ఫుడ్ సీన్.. కానీ?
ఈ నిషేధం తర్వాత పాలిటానా నగర రూపురేఖలు మారిపోయాయి. భక్తులు, పర్యాటకుల కోసం వందలాది వెజిటేరియన్ రెస్టారెంట్లు వెలిశాయి. గుజరాతీ థాలీలు, స్నాక్స్, స్వీట్లు ప్రతి మెనూలో చేరిపోయాయి. అంతకుముందు నాన్-వెజ్ అమ్మే వ్యాపారులు కొందరు వెజిటేరియన్ బిజినెస్లోకి మారగా, మరికొందరు నగరాన్ని విడిచి వెళ్లిపోయారు.
అయితే, ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించలేదు. నచ్చిన ఆహారం తినే స్వేచ్ఛను హరించడమేనని కొందరు కోర్టు మెట్లెక్కారు. స్థానిక ముస్లింలు, నాన్ జైన్ ప్రజలు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన నమ్మకాలు వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది.