IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ

Published : Jun 11, 2026, 01:15 PM ISTUpdated : Jun 11, 2026, 01:17 PM IST

IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. దీని కోసం 17 రాత్రులు, 18 రోజుల దేవ దర్శన యాత్రను ప్రకటించింది. ఈ గోల్డెన్ ట్రిప్ వివరాలు మీకోసం.

PREV
15
ఒక్క టికెట్‌తో ఇండియా మొత్తం చుట్టేయండి.. IRCTC తెచ్చిన క్రేజీ స్పిరిచువల్ ప్యాకేజీ ఇది

లైఫ్‌లో ఒక్కసారైనా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను, పవిత్ర జ్యోతిర్లింగాలను విజిట్ చేయాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ అన్ని ప్లేస్‌లకు ప్లాన్ చేసుకోవడం, టికెట్లు బుక్ చేయడం పెద్ద టాస్క్. అందుకే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భక్తుల కోసం ఒక మైండ్ బ్లోయింగ్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 

అదే ‘దేవ దర్శన యాత్ర: 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాలు’. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ద్వారా సాగే ఈ టూర్ ఒక అల్టిమేట్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. జస్ట్ మీరు సీట్ బుక్ చేసుకుంటే చాలు, మిగతా ఏర్పాట్లన్నీ ఐఆర్‌సీటీసీ చూసుకుంటుంది.

25
IRCTC Jyotirlinga Tour 2026: యాత్ర ఎప్పుడు? రూట్ మ్యాప్ ఎలా ఉండబోతోంది?

ఈ లాంగ్ అండ్ బ్యూటిఫుల్ జర్నీ 2026 సెప్టెంబర్ 3న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది. మొత్తం 17 రాత్రులు, 18 రోజుల పాటు సాగే ఈ మహా యాత్రలో రైలు సుమారు 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 

ఈ టూర్ వారణాసి, జసిది (డియోఘర్), పూరీ, మార్కాపూర్, రామేశ్వరం, పూణే, ఔరంగాబాద్, నాసిక్, ద్వారక, సోమనాథ్, ఉజ్జయిన్ మీదుగా సాగుతుంది. మీకోసం బోర్డింగ్ సదుపాయం ఢిల్లీ సఫ్దర్‌జంగ్, ఘజియాబాద్, అలీగఢ్, తుండ్లా, ఎటావా, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో భోపాల్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మధుర, ఢిల్లీ సఫ్దర్‌జంగ్ స్టేషన్లలో డీ-బోర్డింగ్ అవ్వొచ్చు.

35
ఒకే ట్రిప్‌లో కవర్ అయ్యే పవిత్ర క్షేత్రాలు ఇవే

ఈ ట్రిప్‌లో మీరు సందర్శించే అద్భుతమైన దేవాలయాల లిస్ట్ చూస్తే షాక్ అవుతారు..

  • 3 ధామాలు: జగన్నాథ్ టెంపుల్ (పూరీ), రామనాథస్వామి టెంపుల్ (రామేశ్వరం), ద్వారకాధీష్ టెంపుల్ (ద్వారక).
  • 11 జ్యోతిర్లింగాలు: కాశీ విశ్వనాథ్ (వారణాసి), బైద్యనాథ్ ధామ్ (డియోఘర్), మల్లికార్జున (మార్కాపూర్), భీమశంకర్ (పూణే), ఘృష్ణేశ్వర్ (ఔరంగాబాద్), త్రయంబకేశ్వర్ (నాసిక్), నాగేశ్వర్ (ద్వారక), సోమనాథ్ (వెరావల్), మహాకాళేశ్వర్ (ఉజ్జయిన్), ఓంకారేశ్వర్ (ఖండ్వా).
  • ఇతర సైట్‌సీయింగ్: వారణాసి ఘాట్లు (బోట్ రైడ్), పూరీ బీచ్, ధనుష్కోడి, విభీషణ్ టెంపుల్, ఎల్లోరా గుహల్లోని కైలాష్ మందిర్ (UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్), పంచవటి, బేట్ ద్వారక, సోమనాథ్ బీచ్, భాల్కా తీర్థ్.
45
IRCTC Jyotirlinga Tour 2026: ఫైవ్ స్టార్ రేంజ్ సౌకర్యాలు.. రైలులోనే రెస్టారెంట్

ఈ భారత్ గౌరవ్ రైలు చాలా స్పెషల్. ఇందులో కేవలం 150 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇందులో సుపీరియర్ ఏసీ ఫస్ట్ క్లాస్ (కూపే - 20, కేబిన్ - 38 సీట్లు), డీలక్స్ ఏసీ సెకండ్ క్లాస్ (36 సీట్లు), కంఫర్ట్ ఏసీ థర్డ్ క్లాస్ (56 సీట్లు) అందుబాటులో ఉన్నాయి. రైలు లోపలే ఒక విలాసవంతమైన రెస్టారెంట్ ఉంటుంది, అక్కడే మీకు వేడివేడి వెజిటేరియన్ ఫుడ్ సర్వ్ చేస్తారు.

అంతేకాదు, ఆధునిక వంటగది, షవర్ క్యూబికల్స్, సెన్సార్ బేస్డ్ వాష్ రూమ్‌లు ఉన్నాయి. రైలు అంతటా సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డుల ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ప్యాకేజీ తీసుకుంటే మీకు పుణ్యక్షేత్రాలలో 3-స్టార్ హోటల్ వసతి (మొత్తం 6 రాత్రులు హోటల్ స్టే, మిగతా 11 రాత్రులు రైలులోనే ప్రయాణం) లభిస్తుంది. లోకల్ సైట్‌సీయింగ్ కోసం ఏసీ వెహికల్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, హెల్ప్ కోసం టూర్ మేనేజర్ కూడా ఉంటారు.

55
దేవ దర్శన యాత్ర: 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాలు: బడ్జెట్ ఎంత? టికెట్ ధరల ఫుల్ డిటెయిల్స్

ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే ఒక సూపర్ ఆఫర్ ఇస్తోంది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘భారత్ గౌరవ్ ట్రెయిన్’ స్కీమ్ కింద దాదాపు 33% వరకు కన్సెషన్ ఇస్తుండగా, ఈ తగ్గింపు ఆల్రెడీ టికెట్ ధరల్లోనే కలిసిపోయింది. ఈ టూర్‌లో మీరు ఎంచుకునే కోచ్, వసతిని బట్టి పర్ పర్సన్ బడ్జెట్ మారుతుంది.

ఒకవేళ మీరు కంఫర్ట్ ఏసీ థర్డ్ క్లాస్ (AC 3 Tier) బుక్ చేసుకుంటే.. ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 1,46,545, డబుల్ షేరింగ్‌కు రూ. 1,49,965, సింగిల్ షేరింగ్‌కు రూ. 1,73,910 చొప్పున ఛార్జ్ చేస్తారు. అదే డీలక్స్ ఏసీ సెకండ్ క్లాస్ (AC 2 Tier)లో అయితే.. ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 1,78,575, డబుల్ షేరింగ్‌కు రూ. 1,81,995, సింగిల్ షేరింగ్‌కు రూ. 2,05,940 గా నిర్ణయించారు. ఇక అత్యంత విలాసవంతమైన సుపీరియర్ ఏసీ ఫస్ట్ క్లాస్ (AC 1st Class) విషయానికి వస్తే.. ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 1,94,590, డబుల్ షేరింగ్‌కు రూ. 1,98,010, సింగిల్ షేరింగ్‌కు రూ. 2,21,955 ధర ఉంటుంది.

ఒకవేళ మీతో పాటు 5 నుండి 11 సంవత్సరాల పిల్లలు వస్తుంటే.. వారి కోసం క్లాస్‌ను బట్టి రూ. 1,34,380 (AC III), రూ. 1,66,410 (AC II), లేదా రూ. 1,82,425 (AC I) టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులోనే మీకు రైలు ప్రయాణం, 3-స్టార్ హోటల్ వసతి, లోకల్ సైట్‌సీయింగ్ ఏసీ వెహికల్స్, ప్యూర్ వెజ్ ఫుడ్, ఇన్సూరెన్స్ వంటివన్నీ కవర్ అయిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories