దేవ దర్శన యాత్ర: 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాలు: బడ్జెట్ ఎంత? టికెట్ ధరల ఫుల్ డిటెయిల్స్
ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే భక్తుల కోసం భారతీయ రైల్వే ఒక సూపర్ ఆఫర్ ఇస్తోంది. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ‘భారత్ గౌరవ్ ట్రెయిన్’ స్కీమ్ కింద దాదాపు 33% వరకు కన్సెషన్ ఇస్తుండగా, ఈ తగ్గింపు ఆల్రెడీ టికెట్ ధరల్లోనే కలిసిపోయింది. ఈ టూర్లో మీరు ఎంచుకునే కోచ్, వసతిని బట్టి పర్ పర్సన్ బడ్జెట్ మారుతుంది.
ఒకవేళ మీరు కంఫర్ట్ ఏసీ థర్డ్ క్లాస్ (AC 3 Tier) బుక్ చేసుకుంటే.. ట్రిపుల్ షేరింగ్కు రూ. 1,46,545, డబుల్ షేరింగ్కు రూ. 1,49,965, సింగిల్ షేరింగ్కు రూ. 1,73,910 చొప్పున ఛార్జ్ చేస్తారు. అదే డీలక్స్ ఏసీ సెకండ్ క్లాస్ (AC 2 Tier)లో అయితే.. ట్రిపుల్ షేరింగ్కు రూ. 1,78,575, డబుల్ షేరింగ్కు రూ. 1,81,995, సింగిల్ షేరింగ్కు రూ. 2,05,940 గా నిర్ణయించారు. ఇక అత్యంత విలాసవంతమైన సుపీరియర్ ఏసీ ఫస్ట్ క్లాస్ (AC 1st Class) విషయానికి వస్తే.. ట్రిపుల్ షేరింగ్కు రూ. 1,94,590, డబుల్ షేరింగ్కు రూ. 1,98,010, సింగిల్ షేరింగ్కు రూ. 2,21,955 ధర ఉంటుంది.
ఒకవేళ మీతో పాటు 5 నుండి 11 సంవత్సరాల పిల్లలు వస్తుంటే.. వారి కోసం క్లాస్ను బట్టి రూ. 1,34,380 (AC III), రూ. 1,66,410 (AC II), లేదా రూ. 1,82,425 (AC I) టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజులోనే మీకు రైలు ప్రయాణం, 3-స్టార్ హోటల్ వసతి, లోకల్ సైట్సీయింగ్ ఏసీ వెహికల్స్, ప్యూర్ వెజ్ ఫుడ్, ఇన్సూరెన్స్ వంటివన్నీ కవర్ అయిపోతాయి.