కావాలనే ట్రోలర్స్ కు ఛాన్స్ ఇస్తున్న రష్మిక.. ఇవేం స్టిల్స్ అంటూ ఆడేసుకుంటున్న నెటిజన్లు!

First Published Dec 19, 2022, 12:44 PM IST

ఓ ఈవెంట్ కు హాజరైన హీరోయిన్ రష్మిక మందన్న తను ధరించిన డ్రెస్ పట్ల తెగ ట్రోలింగ్ కు గురైంది. ఇప్పుడిప్పుడే మంట చల్లారుతుంటే.. మళ్లీ అదే అవుట్ ఫిట్ లో కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో వదలడంతో నెటిజన్లు ఆడేసుకుంటున్నారు.
 

మరోసారి ట్రోలింగ్ కు గురైంది స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna). ఇప్పటికే పలు ఈవెంట్లకు హాజరవుతున్న ఈ ముద్దుగుమ్మ మితిమీరిన ఫ్యాషన్ సెన్స్ తో కొన్నిసార్లు ట్రోలింగ్ కు గురైంది. కొన్ని ఆక్వార్డ్ పిక్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
 

‘కాంతారా’ విషయంలోనూ ఈ కన్నడ బ్యూటీ చేసిన కామెంట్స్ మొన్నటి వరకు హాట్ టాపిక్ గానే నిలిచాయి. ఫలితంగా రష్మిక ఎప్పుడూ వార్తలో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కింది. దీంతో తెగ ఆడేసుకుంటున్నారు. 

అయితే,  నిన్న ముంబైలో నిర్వహించిన ‘గ్రేజియా ఇండియా’ ఈవెంట్ లో రష్మిక మందన్న పాల్గొంది. ఈ కార్యక్రమానికి బ్లాక్ బెల్డ్, కరాటేకు సంబంధించిన డ్రెస్ ను ధరించి హాజరైంది. ప్రస్తుతం ఈ డ్రెస్ చర్చనీయాంశంగా మారింది. దీంతో కరాటే క్వీన్ లా ఉందంటూ.. ట్రోలర్స్ తెగ ఆడేసుకుంటున్నారు. 

ఈ తరుణంలోనే మరోసారి ట్రోలర్స్ కు అవకాశం ఇచ్చేలా అదే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. ఆ పిక్స్ ను నెట్టింట వదలడంతో ట్రోలర్స్, నెటిజన్లు ఆ పిక్స్ పై క్రేజీగా కామెంట్లు చేస్తున్నారు. డ్రెస్ ఒక ఎత్తైతే.. ఈ స్టిల్స్ ఏంటంటూ ట్రోల్ చేస్తున్నారు. 
 

అచ్చు టాయిలెంట్ లో కూర్చున్నట్టే ఉన్నాయంటూ ఎడిట్ ఫొటోలను కామెంట్ సెక్షన్లలో పెడుతున్నారు. మరికొందరూ రష్మికకు మద్దుతుగా నిలుస్తున్నారు. లైక్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మికకు ఇటీవల కాస్తా టైం కలిసి రావడం లేదు. ఏం చేసినా కాస్తా రివర్సే అవుతోందని పలువురు భావిస్తున్నారు. 
 

ఇదిలా ఉంటే.. రష్మిక మందన్నకు పాన్ ఇండియన్ హీరోయిన్ గా క్రేజ్ సాధించి పెట్టిన చిత్రం ‘పుష్ప : దిరైజ్’ విడుదలై నిన్నటితో ఏడాది పూర్తైంది. దీంతో యూనిట్ ఒకరికొకరు విషెష్ తెలుపుతున్నారు. రష్మిక మాత్రం డీఎస్పీకి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది. తనకోసం ‘రారా సామీ’ సాంగ్ ను అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ‘పుష్ప : ది రూల్’లో నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ‘వారసుడు’తోనూ అలరించబోతోంది.

click me!