'భీమ్లా నాయక్' సెట్ లో పవన్, లుంగీ లుక్ కేక.. ఆయన ముందు గులకరాళ్ళం అంటున్న త్రివిక్రమ్

First Published Sep 18, 2021, 3:31 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం భీమ్లా నాయక్. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. లుంగీ గెటప్ లో పవన్ అగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. 

ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పవన్, త్రివిక్రమ్ మధ్య భీమ్లా నాయక్ సెట్ లో ప్రత్యేక చర్చ జరిగింది. తెలుగు జాతి గర్వించదగ్గ కవి శ్రీశ్రీ గురించి వీరిద్దరూ మాట్లాడుకున్నారు. 

శ్రీశ్రీ చేత రాతతో ఉన్న మహా ప్రస్థానం పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కు బహుకరించారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ 'కవి తాలూకు ప్రయాణం అంటే ఒక జాతి తాలూకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు.. రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది.. చాలా శతాబ్దాలపాటు మాట్లాడుకుంటూనే ఉంటుంది' అని త్రివిక్రమ్ అన్నారు. 

శ్రీ శ్రీ ముందు తనలాంటి వారంతా గులకరాళ్ళతో సమానం అని త్రివిక్రమ్ అన్నారు. ఈ పుస్తకంలో పలు విషయాలని పవన్ త్రివిక్రమ్ ని అడిగి తెలుసుకున్నారు. 

త్రివిక్రమ్ శ్రీ శ్రీ గురించి మాట్లాడుతూ ఉంటే.. పవన్ కలగజేసుకుని ఒక కవి మరొక కవి గురించి చెబుతుంటే ఆ సొగబు బావుంటుంది అని అన్నారు. దీనితో అక్కడ నవ్వులు విరిశాయి. 

ఇక భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు.పవన్ కి జోడిగా నిత్యామీనన్ నటిస్తోంది. రానా పక్కన నటించే హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. మలయాళీ నటి సంయుక్త మీనన్ తో సంప్రదింపులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

click me!