Karthika Deepam: ఇంద్రుడు దంపతులను వేడుకున్న సౌందర్య.. దీపను బ్రతికించమని దేవుడిని ప్రార్థిస్తున్న కార్తీక్?

First Published Jan 3, 2023, 8:30 AM IST

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఒకటే కథతో నిత్యం ట్విస్ట్ ల మీద ట్విస్టులతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు జనవరి 3వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈ రోజు ఎపిసోడ్ లో  కార్తీక్ ని ప్రార్థిస్తూ భగవంతుని నేను ఎప్పుడు అది కావాలి ఇది కావాలి అని ప్రార్థించలేదు కానీ ప్రస్తుత పరిస్థితులలో నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు దీపని కాపాడు దీపని రక్షించు అనే మొక్కుకుంటూ ఉంటాడు. దీప ఎన్నో పూజలు చేసింది ఎన్నో వ్రతాలు చేసింది అయినా కూడా ఎందుకు దీపకు ఇలాంటి పరిస్థితి కలిగించావు. ఆ మాత్రం కనికరం లేదా స్వామి, దీపకు నూరేళ్ల ఆయుష్షు ఇవ్వు అని హారతి ఇస్తూ ఉండగా ఆ శబ్దానికి దీప నిద్ర లేస్తుంది. అప్పుడు దీప పైకి లేవడానికి ప్రయత్నించగా గుండె నొప్పిగా అనిపించడంతో పైకి లేవలేక పోతుంది. ఎందుకు లేవలేక పోతున్నాను శక్తి లేకుండా పోతుంది అని అనుకుంటూ ఉంటుంది. పైకి లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో కార్తీక్ అక్కడికి హారతి తీసుకుని రావడంతో కార్తీక్ ని చూసి సంతోషంతో కింద పడిపోతుండగా జాగ్రత్త దీప అని అంటాడు.
 

 ఇందాక లేవలేకపోయాను ఇప్పుడు మిమ్మల్ని చూడగానే నాకు ఎక్కడ లేని సంతోషం శక్తి వచ్చింది అని అనడంతో నీకేం కాదు దీప దేవుడు నేను ప్రార్థించాను అని చెబుతాడు కార్తీక్. అప్పుడు దీపకి ఎన్ని అయినా చేస్తారు కానీ మీ ఆలోచన మాత్రం మార్చుకోరు అని అంటుంది. మళ్లీ దీప ఎప్పుడు మాదిరి మాట్లాడడంతో మాట్లాడకు అని అంటాడు కార్తీక్. దేవుడిని నేను మొక్కుకున్నాను మనిద్దరం ఇలాగే కలిసి ఉంటాం అని అంటాడు. మరొకవైపు చారుశీల దగ్గరికి సౌందర్య రావడంతో ఈవిడెంటి సడన్ గా ఇలా వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ రాసి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ని చారుశీలకు ఇవ్వడంతో అది చూసి చారుశీల షాక్ అవుతుంది.
 

ఏంటమ్మా అంత సేపు ఆలోచిస్తున్నావు అనడంతో నో డౌట్ కార్తీక్ హ్యాండ్ రైటింగ్ గుర్తుపట్టేశారు అది అడగడానికి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది చారుశీల. అప్పుడు నిజంగానే ఇది నువ్వే రాసావా అన్నంతో నేనే రాశాను అనడంతో కానీ ఇది నా కొడుకు చేతిరాత అందుకే నిన్ను అడుగుతున్నాను అని అంటుంది సౌందర్య. అబద్ధం చెబుతున్నాడేమో నా కొడుకు దొరికిపోయాడు అన్న ఆశతో వచ్చాను కానీ అని బాధపడుతూ ఉంటుంది సౌందర్య. ఇప్పుడు చారుశీల ఆంటీ నేను పదేపదే మిమ్మల్ని ఆంటీ అని పిలుస్తున్నాను కదా మీకు ఏమీ ఇబ్బంది లేదు కదా అనడంతో నువ్వు ఆంటీ అన్న ప్రతిసారి నాకు మోనిత అనే ఒక పనికిమాలినది గుర్తుకు వస్తుంది అనడంతో చారుశీల షాక్ అవుతుంది.
 

దాంతో నిన్ను పోలుస్తున్నానని బాధపడకు కానీ నువ్వు పిలిచిన ప్రతిసారి నాకు అదే గుర్తుకు వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సౌందర్య. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన సౌందర్య ఆనంద్ రావుతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుడిని కొడుకు కోడలు కనిపించాలని కోరుకోండి మీరు నాతో పాటు రావద్దు ఇంట్లోనే ఉండండి. మనమిద్దరం వెళ్ళిపోతే ఆ హిమ సౌర్య ఇద్దరు కొట్టుకున్న కొట్టుకుంటారు అనడంతో ఇంట్లో ఉన్న మనం ఆపగలమా సౌందర్య వాళ్ళు ఎప్పటికీ కలుస్తారో ఏమో అని అంటాడు ఆనందరావు. సరే మేము బయలుదేరుతాము అని అనడంతో ఇంతలోనే ఇంద్రుడిని ఎక్కడికి పిలుస్తుంది సౌందర్య. కార్తీక్ ని వెతకడానికి వెళ్తున్నాం రా అనడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ నేనా ఎందుకమ్మా అని తడబడుతూ ఉంటాడు.
 

దాంతో అనుమానం వచ్చిన సౌందర్య చంద్రమ్మని పిలిచి ఇంద్రుడి చేతిని తీసుకుని చంద్రమ్మ తల మీద పెట్టి నాకు నిజం కావాలి ఇంద్రుడు. అప్పుడు మళ్లీ ఇంద్రుడు అబద్దం చెప్పడంతో నీ భార్య తల మీద ఒట్టేసి చెబుతున్నావు అది గుర్తుపెట్టుకుని మాట్లాడు అని అంటుంది. ప్పుడు ఇంద్రుడు చెయ్యి తీసేయగా చెయ్యి పెట్టు అని గట్టిగా అరుస్తుంది సౌందర్య. భార్య తల మీద చేయి వేసి నిజం చెప్పాలి అంటే చెయ్యి వణుకుతోందా ఈ రెండు రోజుల్లో నీ భార్య నీ పంచప్రాణాలని నాకు అర్థం అయింది. ఇప్పుడు నువ్వు అబద్దం చెప్పలేవు. నిజం చెప్పు నా బిడ్డల ఆచూకీ నీకు తెలుసు కదా అని నిలదీస్తుంది సౌందర్య. అప్పుడు సౌందర్య ఇంద్రుడిని వేడుకుంటూ చూడు ఇంద్రుడు నువ్వు నిజం చెప్పు నేను నిన్ను ఏమీ అనను అని అంటుంది.
 

 అప్పుడు ఇంద్రుడు ఆలోచనలో పడతాడు. అప్పుడు ఇంద్రుడు  చంద్రమ్మ ఇద్దరినీ సౌందర్య వేడుకుంటూ ఉంటుంది. నిజంగానే నాకు ఏమీ తెలియదు అమ్మ అని అంటే అదే మాట నీ భార్య మీద ఒట్టేసి నాకు ఏమీ తెలియదు అని చెప్పు అనడంతో ఇంద్రుడు షాక్ అవుతాడు. అప్పుడు ఇంద్రుడు చేయి తీసేస్తుండగా  చంద్రమ్మ తనపై చేయి పెట్టుకొని నీకు ఏమీ తెలియదని అమ్మగారితో చెప్పు గండ ఎందుకు ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నావు అని అబద్ధాలు చెబుతుంది. అప్పుడు ఇంద్రుడు కూడా అబద్ధాలు ఆడుతూ నా భార్య మీద ఒట్టేసి చెబుతున్నాను నిజంగానే నాకు ఏమీ తెలియదు అని అనడంతో సౌందర్య బాధపడుతూ ఉంటుంది. తర్వాత అంజి సౌందర్య ఇద్దరు కార్తీక్ వాళ్ళను వెతకడానికి వెళుతూ ఉంటారు.
 

మరొకవైపు కార్తీక్ నిద్ర లేచి దీప కోసం వెళ్లగా దీప వంట చేస్తూ ఉంటుంది. మరొకవైపు సౌందర్య అంజి ఇద్దరూ కార్తీక్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఏం మాట్లాడొద్దు డాక్టర్ బాబు ఏ పని చేయకుండా నన్ను ఇలాగే మరింత రోగిష్టి దాన్ని చేస్తున్నారు అని అంటుంది. ఉండేది కొద్దిరోజులే కదా డాక్టర్ బాబు ఉన్నన్ని రోజులైనా నాకు నచ్చినట్టు ఉండనివ్వండి అని బాధగా మాట్లాడుతుంది దీప. కార్తిక్ ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు. సౌందర్య అంజి ఇద్దరూ దీప వాళ్ళు ఉన్న ఇంటికి దగ్గరలోకి వస్తారు.

click me!