Director Krish : క్రిష్ జీవితంలో అలాంటి సందర్భం కూడా ఉందా? అంత బాధతో కారులోనే!?

First Published Mar 4, 2024, 8:38 PM IST

తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లముడి (Krish Jagarlamudi)  డ్రగ్స్ కేసు తర్వాత ఆయన గురించి షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆయన జీవితంలో ఎంతో ఒత్తిడికి లోనైన సందర్బం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. 

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు క్రిష్ కు మంచి గుర్తింపు లభించింది. ‘గమ్యం’, ‘కంచె’, ‘వేదం’ వంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తన విభిన్నమైన దర్శక ప్రతిభకు ప్రశంసలు అందుకున్నారు. 

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘హరిహర వీరమల్లు’  (Hari Hara Veera Mallu)   చిత్రాన్ని  తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా కాస్తా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇలోగా క్రిష్ డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. 

ర్యాడిసన్ హోటల్ లో తొమ్మిది మందిని పోలీసులు గుర్తించగా అందులో క్రిష్ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రిష్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 

క్రిష్ కెరీర్  ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ‘గమ్యం’ Gamyam Movieతో దర్శకుడిగా మారారు. అయితే ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో, ఆ తర్వాత చాలా ఒత్తిడికి గురయ్యాడంట క్రిష్. అనేక సమస్యలతో సతమతమయ్యాడని తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కారులో ఒక్కడే కూర్చొని ఏడ్చానని తన బాధను వ్యక్తం చేశారు.

అయితే, గమ్యం సినిమా రిలీజ్ చేసే సమయంలో సరైన రేట్ రాకపోవడంతో ఆత్మహత్య కూడా చేసుకోవాలనే భావించారంట. కానీ కుటుంబీకుల సరైన సమయంలో స్పందించినట్టు ప్రచారం.. ఆ తర్వాత టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత సహాయంతో మూవీని రిలీజ్ చేశారంట. 

ఈ విషయంపై అప్పట్లో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ కొంతమంది నెట్టింట మాత్రం చర్చించుకుంటున్నారు. ఏదేమైనా క్రిష్ తన తొలిసినిమాకు ఎంత కష్టపడ్డారో ఈ ఒక్క ఊదాహరణ చాలంటున్నారు. ఆ డెడికేషన్ కు అభినందిస్తున్నారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడంతో అభిమానులు బాధపడుతున్నారు. 

click me!