షూటింగ్ కు రెడీగా సమంత క్రేజీ ప్రాజెక్ట్.. ఎప్పుడు షురూ చేస్తున్నారు.?

First Published Oct 7, 2022, 11:29 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha) బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసింది. ఇందులోని ఓ ప్రాజెక్ట్ కోసం సమంత, వరుణ్ ధావన్ షూటింగ్ కు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

సౌత్ లో వెలుగొందుతున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ‘పుష్ప 2’తో అభిమానుల్లో న్యూ ఎనర్జినీ ఫిల్ చేసిన స్టార్ హీరోయిన్ హిందీలో నూ భారీ చిత్రాలను లైన్లో పెడుతోంది. ఇప్పటికే రెండు, మూడు చిత్రాలను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.
 

బాలీవుడ్ నుంచి సమంత మంచి ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. అందులోని ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం పట్టాలెక్కబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్ లో నటించేందుకు గతంలోనే సమంత ఓకే చెప్పింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పై క్రేజీ అప్డేట్ అందింది.
 

‘ది ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ తో సమంత నార్త్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ వెబ్ సిరీస్ ను రాజ్ నిడిమోరు, క్రిష్ణ డీకే తెరకెక్కించారు. మళ్లీ వీరి ఆధ్వర్యంలో మరో క్రేజీ  ప్రాజెక్ట్ ను చేయబోతున్నది. ఈ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhavan) కూడా నటిస్తున్నారు. 

వరుణ్ ధావన్, సమంతా రూత్ ప్రభు జంటగా నటించనున్న ఈ ప్రాజెక్ట్ ను రూసో బ్రదర్స్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’(Citadel)కు రీమేక్ గా తెరకెక్కించబోతున్నారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్స్ గా రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే సమంత ఈ ప్రాజెక్ట్ కోసం మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ  పొందింది. 
 

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం మూవీ షూటింగ్ కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలోనే (నవంబర్) చిత్రీకరణను మొదలుపెట్టబోతున్నారని సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సమంత నటించి భారీ చిత్రాలు ‘యశోద’, ‘శాకుంతలం’ కూడా  విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా  కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.  సమంత  కేరీర్ లోనే ఈ రెండు చిత్రాలు భారీ స్థాయిలో రూపుదిద్దుకోవడంతో హైప్ క్రియేట్ అయ్యింది.

click me!