సమంత, కాజల్‌, తమన్నా, పూర్ణ, ప్రియమణి, రాశీఖన్నా.. సినిమాల్లోనే కాదు అక్కడ కూడా దున్నేస్తున్నారు!

First Published Jun 20, 2021, 9:28 PM IST

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ సినిమాలతోపాటు ఆల్టర్‌ నేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఫోకస్‌ పెట్టారు. సమంత, కాజల్‌, తమన్నా, ప్రియమణి, రాశీఖన్నా, నిత్యా మీనన్‌, హన్సిక వంటి భామలు వెబ్‌ సిరీస్‌లతోనూ దూసుకుపోతున్నారు. 

సినిమాలకు ఆల్టర్‌నేట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఇప్పుడు వెబ్‌సిరీస్‌లు ఊపందుకుంటున్నాయి. చిన్న చిన్న కథలను వెబ్‌ సిరీస్‌ రూపంలో చెబుతున్నారు. పెద్ద తెరకి సూట్‌ కాని కథలను ఓటీటీ మాధ్యమాల్లో ఇలా వెబ్‌ సిరీస్‌ రూపంలో తీస్తున్నారు. వీటికి స్టార్‌ హీరోయిన్లు కూడా ఆకర్షితులవడం విశేషం. టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు ఇటీవల డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టి వెబ్‌ సిరీస్‌లతో అదరగొడుతున్నారు. మరికొన్ని కొత్త సిరీస్‌లు చేస్తూ దూసుకుపోతున్నారు. సినిమాలను, వెబ్‌ సిరీస్‌లను బ్యాలెన్స్ చేస్తున్నారు.
undefined
సమంత ఫస్ట్ టైమ్‌ డిజిటల్‌ రంగంలోకి దిగి తొలి ప్రయత్నంగా `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇందులో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో,యాక్షన్‌ ఎపిసోడ్స్ తో దుమ్ములేపింది. సౌత్‌లోనే కాదు హిందీలోనూ పాపులారిటీని పొందింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌ లో మరో వెబ్‌ సిరీస్‌ చేయబోతుందని టాక్‌.
undefined
కాజల్‌ ఆ మధ్య `లైవ్‌ టెలికాస్ట్` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. హర్రర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌లో దెయ్యంగా నటించి కట్టిపడేసింది. ఇకపై తాను సినిమాలతోపాటు వెబ్‌ సిరీస్‌ల్లో నటించేందుకు రెడీగా ఉందట. అందులో కొన్నింటికి చర్చలు జరుగుతున్నాయని టాక్‌.
undefined
తమన్నా సైతం ఫస్ట్ టైమ్‌ డిజిటల్‌లోకి అడుగుపెట్టి `లెవెన్త్ హవర్‌` వెబ్‌ సిరీస్‌లో నటించి మెప్పించింది.ఇటీవల `నవంబర్‌ స్టోరీ` అనే మరో వెబ్‌ సిరీస్‌లోనూ అదరగొట్టింది. సినిమాలే కాదు వెబ్‌ సిరీస్‌లతోనూ కెరీర్ని బ్యాలెన్స్ చేయాలని, భవిష్యత్‌ వెబ్‌సిరీస్‌లదే అనే సంకేతాలిస్తుంది. ప్రస్తుతం తమన్నా కూడా పలు వెబ్‌ సిరీస్‌ కథలు వింటుందట. త్వరలోనే వాటి అనౌన్స్ మెంట్‌ ఉంటుందని టాక్‌.
undefined
రాశీఖన్నా సైతం వెబ్‌ సిరీస్‌లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ బ్యూటీకి సినిమాలు తగ్గడంతో డిజిటల్‌పై కన్నేసింది. ప్రస్తుతం ఆమె హిందీలో రాజ్‌ అండ్‌ డీకే కాంబినేషన్‌లో రూపొందుతున్న ఓ వెబ్‌ సిరీస్‌లో షాహిద్‌ కపూర్‌తో కలిసి నటిస్తుంది. అజయ్‌ దేవగన్‌తో `రుద్ర` అనే మరో వెబ్‌ సిరీస్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌.
undefined
`ఢీ` షోతో పాపులర్‌గా మారిన ప్రియమణి రెండేళ్ల క్రితమే డిజిటల్‌ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ఆమె `ఫేమస్‌ ఫిల్మ్‌ఫేర్‌`, `ది ఫ్యామిలీ మ్యాన్‌`, `హిజ్‌ స్టోరీ`లో నటించింది. ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` లో అదరగొట్టింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరికొన్ని వెబ్‌ సిరీస్‌లున్నాయని టాక్‌. సినిమాలు, టీవీ షోస్‌, వెబ్‌ సిరీస్‌లతో ఫుల్‌ బిజీగా ఉందీ భామ.
undefined
మరో `ఢీ` ముద్దుగుమ్మ పూర్ణ సైతం వెబ్‌ సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. హీరోయిన్‌గా సినిమాల్లో అంతగా పేరు రాకపోవడంతో టీవీ షోస్‌, వెబ్‌ సిరీస్‌లపై దృష్టి పెట్టిందట. గతేడాది తమిళంలో `కన్నమూచి` అనే వెబ్‌ సిరీస్‌ చేయగా, ప్రస్తుతం `నవరస`లో నటిస్తుంది.
undefined
హీరోయిన్‌గా సినిమాలు లేకపోవడంతో నిత్యా మీనన్‌ కూడా వెబ్‌ సిరీస్‌లు, డిజిటల్‌ రంగాన్ని నమ్ముకుంటుందట. గతేడాది హిందీలో `బ్రీత్‌` అనే వెబ్‌ సిరీస్‌ చేసిన నిత్యా ఇప్పుడు `నవరస`లో నటిస్తుంది. తమిళంలో ఇది రూపొందుతుంది.
undefined
పాలబుగ్గల బ్యూటీ హన్సికకి కూడా సినిమాలు తగ్గిపోయాయి. దీంతో ఈ అమ్మడు కూడా డిజిటల్‌ పై ఫోకస్‌ చేసింది. ప్రస్తుతం `నషా `అనే తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది.
undefined
click me!