Ennenno Janmala Bandham: యస్, వేదలకు శోభనం ఏర్పాటు చేసిన రాజారాణి... అసలు విషయం తెలుసుకుని షాకైన రాణి?

First Published Jan 13, 2023, 1:20 PM IST

Ennenno Janmala Bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది.  నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు జనవరి 13వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ లో వేద ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడు రాణి పనిమనిషిని పిలిచి తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. ఏమైంది అమ్మమ్మ ఏంటి ఈ హడావిడి అనడంతో నువ్వు ఇక్కడే ఉన్నావా లేదా మరిచిపోయాను ఈరోజు మీ శోభనం అని అంటుంది రాణి. ఇప్పుడు ఇదంతా ఎందుకు అమ్మమ్మ అనడంతో అయ్యో అలా అంటావేంటి అన్యోన్య దాంపత్య అమృతంలో ఇది కూడా ఒక భాగమే ఈ రోజు రాత్రి శోభనం జరగాలి. రేపొద్దున్నే పూజ చేసి ఒడి బియ్యం పోస్తే అప్పుడు పూజ ఫలితం దక్కుతుంది అప్పుడే పూజ పూర్తవుతుంది అని అంటుంది.

 ఈ తంతు మొత్తం పూర్తయితే గానీ పూజ పూర్తయినట్టు కాదు ప్రత ఫలితం దక్కదు అనడంతో అదికాదు అమ్మమ్మ అనగా ఇది నేను చెప్పేది కాదు. వాళ్ళు పెట్టిన సంప్రదాయం కళ్ళు పోతాయి లెంపలేసుకో అని అంటుంది. మరొకవైపు యష్ మరొకవైపు ఆఫీసులో అర్జెంట్లు పనులు ఉన్నాయి గ్రాండ్ ఫా వెళ్లాలి అనడంతో ఈ ఒక్క రాత్రికి ఉండు మనవడా అని అంటాడు రాజా. ఇది మీ వ్రతంలో ఒక భాగం అని రాజా యష్ కి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజా.

ఆ తర్వాత వేదనీ రాణి, ముత్యాలు ఇద్దరూ రెడీ చేస్తూ ఉంటారు. మరొకవైపు రాజా యష్ ని రెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడు రాజా యష్ కి సెంటు కొట్టబోతుండగా వద్దు తాతయ్య తనకి సెంటు కొట్టుకోవడం ఇష్టం లేదని కంప్లైంట్ బాక్స్ లో రాసి వేసింది అనడంతో అవునా అని నవ్వుతూ ఉంటాడు రాజా. మరోవైపు వేద చేతినిండా గాజులు వేసుకోవడంతో ఏంటి ఇన్ని గాజులు వేసుకున్నావు అని రాని అడగగా ఇంతకుముందు నీలాగే ఉండే దాన్ని కానీ ఆయనకు ఇలా గాజులు వేసుకోవడం ఇష్టమని ఫిర్యాదుల బాక్స్ లో చీటీ ద్వారా చెప్పాడు అని అంటూ రాని నవ్వుకుంటూ ఉంటుంది.
 

 ఒకవైపు యష్ కి రాజా జాగ్రత్తలు చెబుతూ ఉండగా మరొకవైపు రాణి వేదకి మంచి విషయాలు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత వేద పాల గ్లాస్ తీసుకొని రూమ్ కి వెళ్తుంది. ఇంతలోనే అక్కడికి యష్ వస్తాడు. అప్పుడు వారిద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. చాలా అందంగా ఉన్నావు వేద అనగా థాంక్స్ అని అంటుంది. అప్పుడు వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడడానికి తడబడుతూ గ్రాండ్ మా ఏం చెప్పింది అని వేదనీ యేష్ అడగగా నీకు తాతయ్య ఏం చెప్పాడు అని వేద అడుగుతుంది. చాలా చెప్పాడు అని అంటాడు యష్. చాలా అంటే అనగా అప్పుడు యష్ ఇబ్బంది పడుతూ ఉండగా అప్పుడు పాలు తాగండి అని పాలు ఇస్తుంది వేద.
 

మరొకవైపు గది బయట రాజావారి మాటలు వింటూ ఉంటాడు. పాలు తాగండి అనడంతో నిద్ర బాగా పట్టడానికే ఆరోజు బయట పడుకున్నప్పుడు చెప్పావ్ కదా అని అంటాడు. అది మొన్న చెప్పింది ఇప్పుడు వేరేది చెప్పింది అనడంతో ఏం చెప్పింది అని అడుగుతాడు యష్. అప్పుడు వేద చెప్పడానికి సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు యష్ పాలు తాగి సగం వేద కి ఇస్తాడు. అప్పుడు వేద కింద పడుకుంటుండగా చేయి పట్టుకొని వద్దు పైనే పడుకో అమ్మమ్మ వాళ్లకు తెలిస్తే బాధపడతారు అనడంతో ఇద్దరు కలిసి బెడ్ పై పడుకుంటారు. అప్పుడు వేద ఎవరితో ఎవరు మాట్లాడకుండా మౌనంగా సైలెంట్ గా పడుకొని ఉంటారు.
 

అప్పుడు యష్ తన మనసులో నేను ఖుషి కి తండ్రి గానే మాత్రమే ఉన్నాను జీవితాంతం అలాగే ఉండాలా అని అనుకుంటూ ఉంటాడు. నేను వేద భర్తని కాలేనా, నా జీవితం ఇంతేనా అనుకుంటుండగా, వేద కూడా యష్ మాదిరి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తెల్లవారుతుంది. అప్పుడు వేద నిద్ర లేస్తుంది.. యష్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఖుషి కి అమ్మానాన్నలుగా మేమిద్దరం కాదు ఒక్కటైపోయాము అని అనుకుంటూ ఉంటుంది వేద. కానీ భార్యాభర్తలు గా మేము ఎప్పటికీ ఒకటి కాదు, ఇద్దరమే, వేరువేరే ఎప్పటికీ ఒకటి కాలేమో అనుకుంటూ ఉంటుంది. మేమిద్దరం ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నాము కానీ బయట అమ్మమ్మ వాళ్ళను నొప్పించలేం కదా మమ్మల్ని కలపాలని ఎంతో తాపత్రయంతో గుడిలో మాతో పూజ చేయించారు.
 

శోభనం కూడా ఏర్పాటు చేశారు. మా ఇద్దరి మధ్య వాళ్ళు ఆశపడినట్లు ఏమి జరగలేదని తెలిస్తే చాలా బాధపడతారు అనుకుంటూ ఉంటుంది వేద. కాబట్టి శోభనం జరిగినట్టు నటించాలి అని అద్దం ముందుకు వెళుతుంది వేద. అప్పుడు వేద తన జుట్టు చెరిపీ వేసుకొని, బొట్టు తుడుచుకొని పూలన్నీ రాలిపేస్తూ ఉంటుంది. అదంతా కిటికీలో నుంచి చూసిన రాణి షాక్ అవుతుంది. అప్పుడు వేద తన చీరని నలుపుకుంటూ డౌట్ రాకుండా ఉండాలి అని బయటకు వెళ్తుంది. రాణి అదంతా చూసి బాధతో బయటికి వెళుతుంది.

ఏంటి రాణి ఇంకా మనవడు మనవాళ్ళు ఇంకా నిద్ర లేవలేదా అని సంతోషంగా అడగగా రాణి మౌనంగా ఉంటుంది. ఇప్పుడు వేద అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ తాతయ్య గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అని సంతోషంగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. తాతయ్య ఆయన్ని లేపకండి నేను స్నానం చేసి లేపుతాను అని సంతోషంగా ఉన్నట్లు నటిస్తుంది వేద. అది చూసి రాజా సంతోషపడుతుండగా వాళ్ళిద్దరూ కలవలేదు అని రాణి చెప్పడంతో రాజా షాక్ అవుతాడు.

click me!