ఉపాసన `మిస్టర్ సీ` అని పిలవడం వెనకాల సీక్రెట్‌ రివీల్‌ చేసిన రామ్ చరణ్‌.. ఎన్టీఆర్ ఫిదా

First Published Aug 23, 2021, 10:11 PM IST

రామ్‌చరణ్‌, ఉపాసన పెళ్లికి ముందు మంచి స్నేహితులు. వారిలో మ్యారేజ్‌ వెనకాల లవ్‌ స్టోరీ కూడా ఉందని గతంలో ఓ సందర్భంలో చెప్పారు చరణ్‌. అయితే తాజాగా చెర్రీ ఓ సీక్రెట్‌ని వెల్లడించారు. ఉపాసన తనని `మిస్టర్ సీ` అని పిలవడం వెనకాల కారణం తెలియజేశాడు. 
 

రామ్‌చరణ్‌ తాజాగా ఎన్టీఆర్‌ హోస్ట్ గా చేస్తున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` షోలో పాల్గొన్నారు. ఆదివారం ప్రారంభమైన ఈ షోలో గెస్ట్ గా రామ్‌చరణ్‌ వచ్చారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్న నేపథ్యంలో వీరిద్దరు కలిసి `ఎవరు మీలో కోటీశ్వరులు` షోలో సందడి చేయడం అభిమానులను ఖుషీ చేస్తుంది. 
 

రామ్‌చరణ్‌ ఇందులో చాలా విజయవంతంగా ఆడుతున్నారు. రెండో రోజు కూడా బాగా ఆడి ఆయన ఏకంగా 25లక్షలు గెలుచుకున్నారు. రెండు లైఫ్‌ లైన్లు వాడుకుని రూ.25లక్షలు గెలుచుకోవడం విశేషం. 50 లక్షల ప్రశ్నకు సిద్ధమవుతుండగా షో ముగిసిందనే శబ్దం (ట్యూటర్) వినిపించడంతో రాంచరణ్‌తో 25 లక్షలు సరిపెట్టుకొన్నారు.  ఈ షోలో గెలుచుకున్న ఎమౌంట్‌ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి విరాళంగా అందిస్తామని తెలిపాడు రామ్‌చరణ్‌. దీంతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఎన్టీఆర్‌ సైతం ఆయన్ని అభ

సామాజిక సేవలో భాగంగా సదుద్దేశంతో రాంచరణ్ ఆడిన ఆటను ఎన్టీ రామారావు ప్రశంసించారు. 25 లక్షల చెక్‌ను మీకు ఇవ్వడం గర్వంగా ఉంది. మంచి సమాజ సేవకు ఈ మొత్తాన్ని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద నాకు ఎన్నో ముచ్చట్లు చెప్పి కంటెస్టెంట్లకు ఎలా ఆడాలో నేర్పిన రాంచరణ్‌కు ధన్యవాదాలు అన్ని అన్నారు. దాంతో రాంచరణ్ మాట్లాడుతూ.. తారక్‌తో ఎప్పుడు సమయం దొరికినా గడపడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. అలాంటి నాకు ఈ షోలో చాలా సేపు గడపడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ కోసం 25 గెలుచుకొవడానికి అవకాశం కల్పించినందుకు స్పెషల్ థ్యాంక్స్. బుల్లితెర మీద ఎన్టీఆర్ బెస్ట్ షో మ్యాన్. బుల్లితెర మీద తారక్‌తో షోలో భాగం కావడం చాలా హ్యపీగా ఉంది అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు చరణ్‌.

ఇదిలా ఉంటే రామ్‌చరణ్‌ ఈ సందర్భంగా రాజమౌళిపై ఫిర్యాదు చేశాడు. సెట్‌లో తనని బాగా ఇబ్బంది పెట్టాడని వెల్లడించారు. ఈ విషయంలో ఎన్టీఆర్‌ సైతం రెచ్చిపోయాడు. రాజమౌళి షూటింగ్‌లో ఎంత కచ్చితంగా ఉంటారో వెల్లడించారు. జక్కన్నకి `పర్‌ఫెక్షన్‌` అనే పిచ్చి పీక్‌లో ఉందని అది తగ్గదని తెలిపారు. అంతటి పిచ్చి ఉండటం వల్లే `బాహుబలి` లాంటి సినిమాలు తీయగలిగాడని, మరిన్ని అద్భుతాలు తీయబోతున్నారని వెల్లడించారు. 
 

మరోవైపు ఇందులో ఎన్టీఆర్‌.. రామ్‌చరణ్‌కి సంబంధించిన ఓ సీక్రెట్‌ని బయటపెట్టించాడు. ఉపాసన చరణ్‌ని `మిస్టర్‌ సీ` అని పిలవడం వెనకాల కారణం ఏంటని ప్రశ్నించారు. దీన్ని `ఎవరు మీలో కోటీశ్వరులు` షోలో బయటపెట్టాడు చరణ్‌. 

చరణ్‌ చెప్పిన విషయానికి ఎన్టీఆర్‌ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వీరిద్దరి లవ్‌ స్టోరీకి, `మిస్టర్‌ సీ` పిలవడంలోని ప్రేమానురాగాలకు ఫిదా అయ్యాడు. `మిస్టర్‌ సీ` అంటూ సరదాగా కామెంట్లు చేశాడు ఎన్టీఆర్‌.

ఓ సారి ఉపాసన తాను లాస్‌ ఏంజెల్స్ కి ట్రిప్‌ వెళ్లినప్పుడు అక్కడ ఓ `మిస్టర్‌ సీ` అనే హోటల్‌ ఉండేదట. అందులో వాళ్లిద్దరు డిన్నర్‌ చేశారట. ఈ సందర్భంగా అక్కడి చెఫ్‌తోనూ సరదా చాట్‌ జరిగిందని ఈ క్రమంలో ఉపాసన ఆ హోటల్‌ నచ్చడంతో, ఆ సందర్భంగా జరిగిన సరదా సంఘటన కారణంగా తనకు `మిస్టర్ సీ` అనే పేరు పెట్టిందని, అప్పటి నుంచి `మిస్టర్‌ సీ`గా పిలుస్తుందని చెప్పారు రామ్‌చరణ్‌. 

rrr

ఇక చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రమిది. అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవగన్‌, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మేలో విడుదల కానుందని సమాచారం. 

click me!