రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా... ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది.
టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టీ మహేశ్ బాబు- రాజమౌళి సినిమాపైనే ఉంది. మొన్న సంక్రాంకి వచ్చిన మహేష్ గుంటూరు కారం యావరేజ్ కావటంతో ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు పాన్ ఇండియా రేంజ్లో మహేశ్ బాబు ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది కావటంతో ఆ లెక్కలే వేరుగా ఉంటున్నాయి. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సినిమా ఎప్పుడూ ఎనౌన్సమెంట్ డేట్ కూడా బయిటకు వచ్చింది.
అందుతున్న సమాచారం మేరకు మే 31,2024న ఈ సినిమా లాంచ్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆ రోజు మహేష్ బాబు తండ్రి అయిన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. త్వరలోనే ఈ విషయాన్ని ఎనౌన్స్ చేస్తూ చిన్న టీజర్ వదలబోతున్నారని వినికిడి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలై శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం మల్టిఫుల్ సెట్స్ హైదరాబాద్ లో వేస్తున్నారు. అలాగే ఈ సినిమా కోసం క్రూ మొత్తాన్ని రాజమౌళి సెట్ చేసారని అంటున్నారు. అలాగే ఈ చిత్రం భారీ బడ్జెట్ కావటంతో వేరే నిర్మాతలు కూడా ఇన్వాన్వ్ అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా శ్రీ దుర్గా ఆర్ట్స్ డాక్టర్ కెఎల్ నారాయణ వ్యవహరించనున్నారు. చాలా ఏళ్ల క్రితం ఆయనకు రాజమౌళి- మహేశ్ మాట ఇచ్చారు. దానిని ఈ సినిమాతో నిలిబెట్టుకుంటున్నట్లు సమాచారం. అడ్వేంచర్ నేపథ్యంలో వస్తున్న ఈ ప్రాజెక్ట్కు సుమారు రూ. 1000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఈ భారీ ప్రాజెక్ట్లోకి మరికొందరు బడా నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలా ఈ ప్రాజెక్టులోకి సహ నిర్మాతగా Netflix చేసేందుకు డీల్ జరుగుతోందని అంటున్నారు. అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.
అలాగే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో రూపొందే సినిమా కోసం ఓ ఇండోనేషియన్ హీరోయిన్ ని ఎంచుకొన్నారని వార్తలు వస్తున్నాయి. ఆమె పేరు… చెల్సియా ఇస్లాన్. ఇప్పటికే ఆమె కొన్ని హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. రీసెంట్ గా ఆమెను స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. అయితే చెల్సియాని హీరోయిన్ పాత్ర కోసం ఎంచుకొన్నారా, లేదంటే కీలక పాత్ర కోసం తీసుకొన్నారా? అనేది తెలియాల్సివుంది.
రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో ఎప్పుడో సినిమా రావాల్సి ఉన్నా... ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి భారీ ప్రాజెక్టుల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు రూట్ క్లియర్ అయింది. మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి ప్రపంచంలోకి అడుగుపెడతారు మహేష్. ఈ కాంబినేషన్లో వస్తున్న మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి.
టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి దీనిని గురించి మాట్లాడుతూ... ‘ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ’ అంటూ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది ఉంటుందని తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మించనున్నారు. హై-వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా మూడు భాగాలుగా రానుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
మొత్తం షూటింగ్ ప్రపంచంలోని మూడు దేశాల్లో జరగనుంది. ఈ సినిమా షూటింగ్లో కొంత భాగం దట్టమైన అమెజాన్ అడవుల్లో జరగనుంది. షూటింగ్ ప్రారంభానికి ముందు రాజమౌళి మీడియాతో ఇంటరాక్ట్ అవుతారు. ప్రముఖ హాలీవుడ్ స్టూడియో, కెఎల్ నారాయణతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ , ఇతర నటీనటులను త్వరలోనే ఖరారు చేస్తారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ని త్వరలో ఖరారు చేయనున్నారు.
మహేశ్బాబు మాట్లాడుతూ...‘ఆయనతో పనిచేయాలన్న కల సాకారం కాబోతోంది. రాజమౌళితో ఒక సినిమా చేస్తే, 25 సినిమాలు చేసినట్టే. ఈ ప్రాజెక్టు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నా. ఇది పాన్ ఇండియా మూవీ అవుతుంది. జాతీయ స్థాయిలో సరిహద్దులను ఈ చిత్రం చెరిపేస్తుంది’’ అని అన్నారు.
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇందుకు కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో నిధి వేట ఇతివృత్తంగా ఒక కథ సిద్ధం చేయగా, జేమ్స్బాండ్ తరహాలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.