నేను దానితో విసిగిపోయా.. ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్‌ బాస్‌ ఫేం పునర్నవి

First Published May 8, 2020, 5:20 PM IST

సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన పునర్నవి భూపాలం తరువాత హీరోయిన్‌గానూ పలు  చిత్రాల్లో కనిపించింది. అయితే వెండితెర మీద కనిపించినా రాని క్రేజీ ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ హౌజ్‌ తెచ్చిపెట్టింది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ భామ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3లో కంటెస్టెంట్‌గా కనిపించిన పునర్నవికి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. సినిమాలో వచ్చిన పేరు కన్నా బిగ్ బాస్‌తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. బిగ్ బాస్‌ తరువాత సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయిన ఈ బ్యూటీ తాజా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
undefined
ఇన్‌స్టాగ్రామ్‌లో విషం చిమ్ముతున్న కొంత మంది ఆకతాయిలతో విసిగిపోయిన పునర్నవి, కొంత కాలం తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్‌లు చేయకూడదని నిర్ణయించుకుంది.
undefined
ఇన్‌స్టాగ్రామ్‌ అనేది కొన్ని సార్లు విషపూరితమైన ప్లాట్‌ ఫామ్‌. దీంతో నేను పూర్తిగా విసిగిపోయాను. నేను తిరిగి ఈ ప్లాట్‌ఫాంలోకి రావడానికి కొంత సమయం పడుతుంది. అంటూ కామెంట్ చేసింది పునర్నవి.
undefined
ఈ మధ్య ఢిల్లీలోని విద్యార్థులు బాయ్స్ లాయర్ రూమ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో వివాదాస్పద చర్చ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కూడా పునర్నవి ఘాటుగా స్పందించింది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని కామెంట్ చేసింది.
undefined
అయితే పునర్నవి చేసిన ఈ కామెంట్‌పై కొంత మంది నెగెటివ్ కామెంట్లు చేశారు. ఈ కామెంట్లను తిరిగి సోషల్ మీడియాలో షేర్ చేసిన పునర్నవి.. తాను ఎవరినీ దూషించడానికి, నిందించడానికి సోషల్ మీడియాలోకి రాలేదని చెప్పింది.
undefined
ఈ చర్చ కారణంగానే తాను కొంత కాలం ఈ సోషల్ మీడియా నుంచి బ్రేక్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా వెల్లడించింది పునర్నవి.
undefined
undefined
click me!