బెడ్ పై బోర్లా పడుకొని పరువాలు చూపిస్తున్న ప్రభాస్ రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్.... కృతి టెంప్టింగ్ ఫోజులు కేక!

First Published Jan 18, 2023, 4:00 PM IST


బాలీవుడ్ భామ కృతి సనన్ టెంప్టింగ్ ఫోజులతో టెంపరేచర్ పెంచేశారు. బెడ్ పై బోర్లా పడుకొని పరువాలు చూపిస్తూ చెమటలు పట్టించారు. 
 

Kriti Sanon

ఇక చాలా కాలం తర్వాత ఆదిపురుష్ మూవీతో కృతి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. హీరో ప్రభాస్ రాముడిగా దర్శకుడు ఓమ్ రౌత్ ఆదిపురుష్ తెరకెక్కిస్తున్నారు. పౌరాణికగాథగా తెరకెక్కుతున్న ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు రోల్ చేస్తున్నారు.

Kriti Sanon


కాగా వన్ నేనొక్కడినే సినిమాతో కృతి సనన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. మహేష్(Mahesh Babu) హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ నేనొక్కడినే ప్రేక్షకాదరణ దక్కించుకోలేదు. తర్వాత నాగ చైతన్యకు జంటగా దోచేయ్ చిత్రం చేశారు. ఇది కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. 

దోచేయ్ చిత్రం తర్వాత ఆమె తెలుగులో చిత్రాలు చేయలేదు. బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్న క్రమంలో అక్కడే సెటిల్ అయ్యారు. తెలుగులో కృతి సినిమా చేసి ఏడేళ్లు అవుతుంది. ఆదిపురుష్ ఆమె కమ్ బ్యాక్ మూవీ. ఆదిపురుష్ విజయం సాధిస్తే కృతి కెరీర్ మలుపు తిరిగినట్లే. 

అయితే వరుణ్ ధావన్ కి జంటగా నటించిన భేడియా తోడేలు టైటిల్ తో తెలుగులో కూడా విడుదల చేశారు. ఆ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. ఆదిపురుష్ తో పాటు కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కృతి చేస్తున్నారు. టైగర్ ష్రాఫ్ తో గణపత్ అనే చిత్రం చేస్తున్నారు. వీటితో పాటు అల వైకుంఠపురంలో రీమేక్ షెహజాద్ మూవీలో కృతి నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ప్రభాస్(Prabhas)తో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా ఈ వార్తల్లో నిజం లేదంటున్న టాలీవుడ్ వర్గాలు ప్రభాస్ మీద కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు. గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కృతి ఎఫైర్ నడిపారన్న వాదన ఉంది. 

అయితే ప్రభాస్ తో ఎఫైర్ రూమర్స్ కృతి సనన్ కొట్టిపారేశారు. ఆయన నాకు మంచి మిత్రుడు మాత్రమే. మా మధ్య ప్రేమ చిగురించిందన్న వార్తల్లో నిజం లేదంటూ వివరణ ఇచ్చారు. కాగా ఆదిపురుష్ మూవీ జూన్ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

click me!