ప్రభాస్ కి నమ్మక ద్రోహం చేశాడు.. శర్వానంద్ ఎంగేజ్మెంట్ పై పేలుతున్న జోకులు

First Published Jan 26, 2023, 2:19 PM IST

శర్వానంద్ వివాహం, నిశ్చితార్థం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అనుకున్నట్లుగానే నేడు రిపబ్లిక్ డే రోజున హీరో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. తాజాగా శర్వానంద్ ఇంట పెళ్లి భాజాలు మొదలయ్యాయి. శర్వానంద్ వివాహం, నిశ్చితార్థం గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అనుకున్నట్లుగానే నేడు రిపబ్లిక్ డే రోజున హీరో శర్వానంద్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 

38 ఏళ్ళు వచ్చాక శర్వానంద్ తన బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్ట బోతున్నాడు. నిశ్చితార్థం జరిగింది కాబట్టి వివాహం కూడా త్వరలోనే ఉంటుంది. రక్షిత రెడ్డి అనే యువతిని ప్రేమించిన శర్వానంద్ పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటున్నాడు. రక్షిత రెడ్డి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. తెలంగాణ హై కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డి కుమార్తె ఆమె. 

ఇదంతా ఒకే కానీ ప్రస్తుతం శర్వానంద్ ఎంగేజ్మెంట్ పై జోకులు, మీమ్స్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల శర్వానంద్ బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హాజరైనప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ఎప్పుడు అని బాలయ్య ప్రశ్నించగా.. శర్వానంద్.. ప్రభాస్ తర్వాత చేసుకుంటాను అని బదులిచ్చాడు. ఇప్పుడు ఇదే ట్రెండింగ్ గా మారి నవ్వులు పూయిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ వారికి తోచిన విధంగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

ప్రభాస్ కి శర్వానంద్ నమ్మక ద్రోహం చేసాడు అంటూ బాహుబలి 2లో అనుష్క సీన్ ఇమేజ్ పోస్ట్ చేస్తున్నారు. 'నిన్నే కదరా నా తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పావ్ అని ప్రభాస్ అడుగుతున్నట్లు.. అది నిన్న అన్నా అని శర్వా బదులిస్తున్నట్లు మీమ్ క్రియేట్ చేశారు. 

బ్యాచిలర్స్ లిస్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యావు. ప్రభాస్ అన్నకి కూడా చెప్పు శర్వా అన్నా త్వరగా పెళ్లి చేసుకోమని అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. శర్వానంద్, రక్షితరెడ్డి నిశ్చితార్థానికి టాలీవుడ్ క్రేజీ కపుల్ రాంచరణ్, ఉపాసన దంపతులు అతిథులుగా హాజరయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. రాంచరణ్, శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్స్.. చిన్ననాటి నుంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. 

ప్రభాస్, శర్వానంద్ మధ్య కూడా మంచి సాన్నిహిత్యం ఉంది.  ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శర్వానంద్ కి రక్షితతో పరిచయం ఏర్పడిందట. అభిప్రాయాలు కలవడంతో ఫ్రెండ్ షిప్ మొదలుపెట్టి ప్రేమికులుగా మారారు. వెంటనే కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్ళికి పచ్చ జెండా ఊపారు.

click me!