అవమానాలు ఎదుర్కొన్నా అంటున్న ఎన్టీఆర్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సమీరా... ఆమెను అలా వేధించారట!

First Published Mar 21, 2021, 3:12 PM IST

తెలుగు మూలాలు కలిగిన సమీరా రెడ్డి తెలుగులో చేసింది కేవలం మూడు చిత్రాలే. 2005లో విడుదలైన నరసింహుడు సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కొంచెం కలర్ తక్కువ అయినా. హైట్, సూపర్ ఫిజిక్ తో తెలుగు ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు. 
 

బి గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నరసింహుడు అట్టర్ ప్లాప్. ఐనప్పటికీ సమీరా గ్లామర్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
undefined
అదే ఏడాది చిరంజీవి హీరోగా విజయ భాస్కర్ దర్శకత్వంలో జై చిరంజీవా విడుదలైంది. ఈ మూవీలో సమీరా రెడ్డితో పాటు భూమిక హీరోయిన్ గా నటించారు. ఈ చిత్రం యావరేజ్ గా నిలిచింది.
undefined
సమీరా రెడ్డి మూడవ చిత్రంగా మళ్ళీ ఎన్టీఆర్ తో అశోక్ చేయడం జరిగింది. అశోక్ సైతం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఈ మూవీ తరువాత ఆమె టాలీవుడ్ ని వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఎన్టీఆర్, సమీరా మధ్య ఎఫైర్ ఉందని, వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
undefined
ఈ విషయంలో నిజం ఏమిటో ఎవరికీ తెలియదు. ఆ తరువాత ఎన్టీఆర్, సమీరా తమ తమ కెరీర్స్ లో బిజీ అయ్యారు. 2011లో ఎన్టీఆర్ వివాహం చేసుకోగా.. 2014లో సమీరా వివాహం చేసుకున్నారు.
undefined
అయితే టీనేజ్ లో ఉన్నప్పుడు సమీరా అనేక అవమానాలు ఎదుర్కొన్నారట. తన వెయిట్ కారణంగా ఆమె ఫ్రెండ్స్ తో పాటు కొందరు అవమానానికి గురి చేశారట.
undefined
టీనేజ్ లో ఉన్న ఫోటో పంచుకున్న సమీరా రెడ్డి, ఇప్పటి నుండే తన పిల్లలు ఇతరుల పట్ల అలాంటి కామెంట్స్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారట.
undefined
పిల్లలకు మన తోటి వారు లావుగా, లేదా సన్నగా ఉన్నారని హేళన చేయకూడని నేర్పుతున్నారట. టీనేజ్ లో తాను ఎలా ఉందో ఆ ఫోటో పంచుకున్న సమీరా... ఇలా కామెంట్ చేశారు.
undefined
click me!