అలియాభట్‌ కోసం సమంత, కియారా అద్వానీలను వదిలేసుకున్న ఎన్టీఆర్‌.. ఎందుకోసమే తెలుసా?

First Published Sep 15, 2021, 6:23 PM IST

ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌` హీరోయిన్‌పై మోజు పడ్డాడు. రామ్‌చరణ్‌తో రొమాన్స్ చేసిన బ్యూటీని కోరుకుంటున్నాడు. అలియాభట్‌తో నేషనల్‌ వైడ్‌గా స్టెప్పేస్తానంటున్నాడు. సమంత, కియారా అద్వానీలను కాదని ఎన్టీఆర్‌ ఇలా చేయడం ఆసక్తికరంగా మారింది. 

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా, అలియాభట్‌, ఒలివీయామోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. 

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో అలియాభట్‌తో రామ్‌చరణ్‌ రొమాన్స్ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తుండగా, ఆయన సరసన సీత పాత్రని అలియాభట్‌ చేస్తుంది.ఇప్పటికే విడుదలైన వీరి లుక్స్ ఆకట్టున్నాయి.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్‌ సైతం అలియాభట్‌నే కోరుకుంటున్నాడు. తన నెక్ట్స్ సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా ఉండాలని పట్టుపడుతున్నాడట. ఎన్టీఆర్‌ తన `ఎన్‌టీఆర్‌30` చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో
చేస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది. 

ఈ సినిమాలో హీరోయిన్‌గా మొదట సమంత పేరు తెరపైకి వచ్చింది. ఆల్మోస్ట్ కన్ఫమ్‌ అంటున్నారు. కానీ సమంత, చైతన్యతో పెళ్లి విషయాల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఆమెని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. 

సమంత తర్వాత కియారా అద్వానీని తీసుకోవాలని భావించారు. కొరటాల-మహేష్‌ కాంబినేషన్‌లో వచ్చిన `భరత్‌ అనే నేను`లో కియారా హీరోయిన్‌గా నటించింది. దీంతో ఆమెని మరోసారి రిపీట్‌ చేయాలని కొరటాల భావించారట. కానీ ఎన్టీఆర్‌ మాత్రం అలియాభట్‌ని రికమండ్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

అలియా భట్‌ ప్రస్తుతం తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`తోపాటు హిందీలో `గంగూభాయి కథియవాడి`, `బ్రహ్మాస్త్ర`, `డార్లింగ్స్`, `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్రాల్లో నటిస్తుంది. `డార్లింగ్స్` చిత్రంలో నటించడంతోపాటు
నిర్మిస్తుండటం విశేషం. 

click me!