నాగార్జున ఇండస్ట్రీలో అన్నా అని పిలిచే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా?.. జూ ఎన్టీఆర్ ఫ్యామిలీతో అంతటి అనుబంధం ఉందా?

First Published May 4, 2024, 5:29 PM IST

టాలీవుడ్‌లో సీనియర్‌ స్టార్‌ హీరోల్లో ఒకరైన నాగార్జున.. ఇండస్ట్రీ మొత్తంలో ఒక్కరిని మాత్రమే అన్నయ్య అని పిలుస్తారట. ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం బయటపెట్టారు నాగ్‌. 
 

నాగార్జున టాప్‌ స్టార్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. వరుస పరాజయాల అనంతరం ఆయన ఈ సంక్రాంతికి హిట్‌ కొట్టాడు. `నా సామి రంగ` అంటూ రచ్చ చేశాడు. సంక్రాంతి కోడి పందెంలో విన్నర్‌గా నిలిచాడు. ఇప్పుడు మరోసారి అదే కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.  

అదే సమయంలో నాగ్‌ ఇప్పుడు రూట్‌ మార్చాడు. హీరోగానే కాదు, మల్టీస్టారర్లకి సిద్ధమవుతున్నాడు. బలమైన స్క్రిప్ట్ లు, బలమైన పాత్రలు వస్తే మల్టీస్టారర్‌ చిత్రాలు చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. గతంలోనూ అలాంటి పాత్రలు, సినిమాలు చేశారు. ఇప్పుడు మరోసారి అదే చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రెండు మూడు మల్టీస్టారర్‌ చిత్రాలు చేస్తున్నారు. ధనుష్‌ తో `కుబేరా`, రజనీకాంత్‌తో `కూలీ` చిత్రాల్లో నటిస్తున్నారు నాగ్‌.

ఇదిలా ఉంటే తాజాగా నాగార్జునకి సంబంధించిన ఓ పాత వీడియో క్లిప్‌ ట్రెండ్‌ అవుతుంది. ఇందులో జూ ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టారు నాగ్‌. ఇష్టమైన ఫ్యామిలీ, పవర్‌ ఎవరో కూడా చెప్పారు. ఇందులో జూ ఎన్టీఆర్‌కి ఈ విషయాన్ని చెప్పాడు నాగ్‌. 
 

`మీ ఫ్యామిలీలో నాకు ఫేవరేట్‌ పర్సన్‌ ఎవరో తెలుసా. మీ నాన్నగారు(హరికృష్ణ). నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఇద్దరం కలిసి సినిమాలు చేసిన తర్వాత మరింతగా క్లోజ్‌ అయ్యాం` అని తెలిపారు. దీనికి తారక్‌ స్పందిస్తూ నేను `సీతారామరాజు` చిత్ర షూటింగ్‌ టైమ్‌లో సెట్‌కి వచ్చినప్పుడు చూశా.. బాగా అనేవారు.. తమ్ముడు తమ్ముడు అని చెప్పారు. ఆయన తమ్ముడు అంటే నేను అన్నా అనేవాడిని. అన్నా అని తాను ఎవరినీ పిలవనని, కేవలం హరికృష్ణని మాత్రమే అన్నా అని పిలుస్తానని తెలిపారు నాగ్‌. ఈ క్లిప్‌ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉండటం విశేషం. 
 

నాగార్జున `ఎవరు మీలో కోటీశ్వరుడు` అనే షోకి హోస్ట్ గా చేశారు. దీనికి ఓ రోజులు ఎన్టీఆర్‌ గెస్ట్ గా వచ్చారు. ఈ సందర్భంగా తమ ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని తెలిపారు నాగ్‌. హరికృష్ణ అన్న అంటే చాలా ఇష్టమని, తన ఫేవరేట్‌ పర్సన్‌ అయ్యారని చెప్పారు. హరికృష్ణ, నాగ్‌ కలిసి నటించిన `సీతారామరాజు` మంచి విజయాన్ని సాధించింది. 
 

ఎన్టీ రామారావు కొడుకైనా నందమూరి హరికృష్ణ బాలనటుడిగానే సినిమాలు చేశారు. మెయిన్‌ లీడ్‌గా నాగ్‌తో నటించిన `సీతారామరాజు` చిత్రమే మొదటి మూవీ కావడం విశేషం. ఆయన్ని చూసేందుకు జనం ఆసక్తి చూపించడంతో వరుసగా సినిమాలు చేశారు హరికృష్ణ. `లాహిరి లాహిరి లాహిరలో`, `శివరామరాజు` చిత్రాల్లో మెయిన్ లీడ్‌గా చేయగా, `సీతయ్య`లో ఏకంగా సోలో హీరోగా నటించి హిట్‌ కొట్టాడు. `టైగర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌`, `స్వామి`, `శ్రావణమాసం` సినిమాల్లో నటించారు. ఆయన 2018లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. హరికృష్ణకి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకి జానకీరామ్‌, కళ్యాణ్‌ రామ్‌, సుహాసిని జన్మించగా, రెండో భార్యకి జూ ఎన్టీఆర్‌ జన్మించడం విశేషం. 

click me!