మాల్దీవ్స్ లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నాగ్ హీరోయిన్ దియా మీర్జా

First Published Mar 29, 2021, 3:11 PM IST

బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా హనీమూన్ మూడ్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. సదరు ఫోటోలు దియా ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అవుతున్నాయి. 
 

దియా మీర్జా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. మీర్జా, వైభవ్ లకు ఇది రెండవ వివాహం.పెళ్లిబందంతో ఒక్కటైన ఈ జంట హనీమూన్ అలా అందమైన సాగర తీరాలు కలిగిన మాల్దీవ్స్ లో ప్లాన్ చేశారు.
undefined
ఈ వెకేషన్ లో వైభవ్ కూతురు కూడా జాయిన్ అయ్యారు. వైభవ్ మొదటి భార్య సంతానం ఒక అమ్మాయి కాగా, దియా ఆమెకు స్టెప్ మథర్ అవుతారు.
undefined
ఈ క్యూట్ ఫ్యామిలీ మాల్దీవ్స్ లో వెకేషన్ గడుపుతున్నారు. ఇక దియా  ఎప్పటి కప్పుడు తమ వెకేషన్ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ తన ఆనందం తెలియజేస్తున్నారు.
undefined
2014లో దియా మీర్జా తన బాయ్ ఫ్రెండ్ సాహిల్ సంఘాను వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల కాపురం తరువాత 2019లో వీరు విడిపోవడం జరిగింది.
undefined
మిలీనియం ప్రారంభంలో వెండితెరకు పరిచయమైన దియా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అనేక సినిమాలలో నటించినా బ్రేక్ మాత్రం రాలేదు.
undefined
నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు నిర్మించిన దియా మీర్జా, బుల్లితెర షోలలో కూడా కనిపించారు.
undefined
ఆ మధ్య సీనియర్ హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది దియా. వయసు మళ్ళిన హీరోలు కూడా  జోడిగా కుర్ర హీరోయిన్స్ కావాలంటున్నారని, మాకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆవేదన చెందారు.
undefined
ఇక నాగార్జున హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వైల్డ్ డాగ్ మూవీలో దియా కీలక రోల్ చేశారు. ఏప్రిల్ 2న ఈ చిత్రం విడుదల కానుంది.
undefined
click me!