సింహాసనంపై కుక్క.. ఒక్క వెంట్రుక కూడా పీకలేరు..వారిపై నాగబాబు షాకింగ్‌ కామెంట్‌

First Published Oct 7, 2020, 3:26 PM IST

`బొమ్మ అదిరింది` షో ఇప్పుడు ఏపీలో చిచ్చు పెడుతోంది. ఏపీ సీఎం జగన్‌పై, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన స్కిట్లు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. దీనికి నాగబాబు జడ్జ్ గా ఉండటం ఈ వివాదాన్ని మరింత ఆజ్యం పోసినట్టయ్యింది. 
 

గతంలో `అదిరింది` పేరుతో జీ తెలుగులో ప్రసారం అయినా ఈ షోకి కొత్త లుక్‌ని తీసుకొచ్చారు. `బొమ్మ అదిరింది`గా టైటిల్‌ మార్చి, యాంకర్లని, జడ్జ్ లను మార్చి కొత్తగాప్రజెంట్‌ చేస్తున్నారు. దీనికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. నవదీప్‌ స్థానంలో జానీ మాస్టర్‌ వచ్చారు. ఈ షో గత ఆదివారం ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్‌లో సుమ, అలీసందడి చేసి షోకి ఊపు తీసుకొచ్చారు.
undefined
ఈ షో తొలి రోజు హరి టీమ్‌ లీడర్‌గా ఉన్న రౌడీ బాయ్స్, సద్దాం లీడ్‌ గా ఉన్న గల్లీ బాయ్స్ టీమ్‌లు స్కిట్లు ప్రదర్శించారు. సెలబ్రిటీ ప్రీమియర్‌ లీగ్‌ అనే కాన్సెప్ట్ తో ఈ స్కిట్లనిప్రదర్శించారు. అయితే ఇందులో సినీ రాజకీయ నాయకుల పేరడీలతో క్రికెట్‌ ఆడించారు. రాజశేఖర్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలతో పాటు రాజకీయజగన్‌మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడులను కూడా ఇమిటేట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌గా మరుగుజ్జు రియాజ్‌ ఇమేటేట్‌ చేస్తూ `అన్న వచ్చాడు.. ` అంటూ సెటైరికల్‌గాచేశాడు.
undefined
జగన్‌పై సెటైరికల్‌గా రియాజ్ చేసిన స్కిట్‌పై జగన్ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. షోని, నాగబాబు, శ్రీముఖి, రియాజ్ ఇలా అందరిపై బూతుపురాణం స్టార్ట్ చేశారు.విమర్శలతు విరుచుకుపడుతున్నారు. రియాజ్‌కి ఏకంగా జగన్‌ ఫ్యాన్స్ నుంచి బెదిరింపులు వెళ్ళడంతో సారీ చెప్పాడు. మరోవైపు నాగబాబుపై కూడావిరుచుకుపడుతున్నారు. ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తున్నారు.
undefined
దానికి నాగబాబు సైతం స్ట్రాంగ్‌గానే రియాక్ట్ అయ్యారు. సింహాసనంపై కుక్కన కూర్చోబెట్టి.. మిగతాది మీరే అర్థం చేసుకోండి అన్నట్టుగా ఆ ఫొటోకి `బొమ్మ అదిరింది` అనిక్యాప్షన్ ఇచ్చాడు. ఇది మరింత వివాదాన్ని పెంచుతుంది. ఏపీలో సీఎంగా కుక్కని కూర్చోబెట్టారనే అర్థం వచ్చేలా నాగబాబు ఈ ఫోటోని షేర్‌ చేశారు.
undefined
నాగబాబు విగ్‌ని కామెంట్చేస్తూ రాయల్ హెయిర్ ఆయిల్ అంటూ ఒక పోస్టర్ వైరల్ కావడంతో, దాన్ని కోట్‌ చేస్తూ, `ఎడిటర్‌గా నీ ఫ్యూచర్ బ్రైట్‌గా కనిపిస్తుంది తమ్ముడూ.. బట్ బ్యాడ్ లక్.. నేను ఇంకాఇన్ఫ్లూఎన్సర్ మార్కెటింగ్‌లోకి దిగలేదు. బెటర్‌ లక్‌ నెక్ట్స్ టైమ్‌` అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ పోస్టర్‌లో నాగబాబు మీసం మెలేస్తుండగా.. `ఒక్క వెంట్రుక కూడా పీకలేరు` అనిఉంది.
undefined
నాగబాబు పంచుకున్న ఈ రెండు ఫోటోలో వైఎస్‌ జగన్‌ అభిమానులకు మరింతగా కాలేలా చేస్తున్నాయి. దీంతో వారు మరింతగా నాగబాబుపై రెచ్చిపోతున్నారు. అయితే మెగా బ్రదర్ కి జనసైనికులు అండగా నిలవడం విశేషం.ఇదిలా ఉంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కి, నాగబాబుకి అస్సలు పడదు. సమయం వచ్చినప్పుడల్లా వారిపై నాగబాబు విరుచుపడుతూనే ఉన్నారు. అందులో `బొమ్మ అదిరింది` షో బలవుతుందనే వార్తలొస్తున్నాయి. అదే సమయంలో ఈ వివాదంలో ఈ షో మరింత పాపులర్‌ అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
undefined
click me!