విమానంలో వెళ్లి సాయంత్రానికి ఆ సరదా తీర్చుకొని తిరిగి వచ్చేస్తాం... రకుల్, మంచు లక్ష్మి సీక్రెట్ లీక్

First Published Aug 24, 2021, 4:00 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మీ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఎంతలా ఫ్రెండ్స్ అంటే విహారం నుండి వినోదం వరకు, సాహస యాత్రల నుండి ఆధ్యాత్మిక పర్యటనల వరకు కలిసే చేస్తారు. 

బిజీ లైఫ్ లో ఏమాత్రం విరామం దొరికినా ఈ ఇద్దరు మిత్రులు కలిసి సరదాగా గడపడానికి ప్రణాళికలు వేస్తారు. ఇక హైదరాబాద్ వస్తే రకుల్ మంచు లక్ష్మితో తప్పనిసరిగా కలుస్తున్నారు. బిజీగా ఉన్నప్పటికీ మొబైల్స్ లో టచ్ లో ఉంటారు. 

ఎక్కడ విహారం చేసినా సదరు ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంటారు రకుల్, మంచు లక్ష్మి. కాగా వీరిద్దరి లైఫ్ స్టయిల్ గురించి మరో ఆసక్తికర విషయం బయటపెట్టారు మంచు లక్ష్మి. 

లక్ష్మీ హోస్ట్ గా తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో 'ఆహా భోజనంబు' పేరుతో ఓ వంటల ప్రోగ్రాం ప్రసారం అవుతుంది. ఈ ప్రోగ్రాం కి టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ అతిథులుగా వచ్చి, తమకు వచ్చిన వంటకాలు చేస్తున్నారు. 

లేటెస్ట్ ఎపిసోడ్ కోసం విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ రావడం జరిగింది. అతనితో ముచ్చటిస్తున్న క్రమంలో ఫ్రెండ్ రకుల్ ని తలచుకుంది మంచు లక్ష్మి. 


రకుల్, నేను ఆహార ప్రియులం. ఇష్టమైన ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్లడం మాకు అలవాటు. ఇష్టమైన ఫుడ్ తినాలనే సరదా తీర్చుకోవడం కోసం ఏకంగా విమానంలో సుదూర ప్రాంతం వెళ్లి, ఆ ఫుడ్ తిని మరలా తిరిగి విమానంలో సాయంత్రానికి ఇంటికి చేరుకున్న రోజులు కూడా ఉన్నాయని మంచి లక్ష్మీ తెలిపారు. 

అయితే స్టార్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ఫుడ్ విషయంలో నిమయమాలు పాటిస్తుంది, ఇష్టమైన ఫుడ్ అయినప్పటికీ తక్కువగా తింటుంది. ఫిట్నెస్ కోసం అతిగా తినడదని మంచు లక్ష్మి అన్నారు. తాను మాత్రం కడుపు నిండా తిని, వ్యాయామం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్త పడతానని మంచు లక్ష్మి అన్నారు. 

click me!