శ్రీముఖికి ఇది మానసిక మానభంగం,నాగబాబు పోస్ట్ కి నిహారికను ఎలా టార్గెట్ చేస్తారు... మాధవీలత సంచలన వ్యాఖ్యలు

First Published Oct 9, 2020, 1:45 PM IST

బొమ్మ అదిరింది కామెడీ షో పెద్ద వివాదానికి తెరలేపింది. ఈ షోలో ప్రదర్శించిన ఓ స్కిట్ కారణంగా సోషల్ మీడియా యుద్దానికి తెరలేచింది. ఏపీ సీఎం జగన్ ని ఇమిటేట్ చేస్తూ చేసిన ఓ స్కిట్ నాగబాబుపై జగన్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యింది. దీనితో ఆ షోలో పాల్గొన్న వారిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. 

జబర్దస్త్ నిర్మాతలనువిభేదించి బయటికి వచ్చిన నాగబాబుఅదిరింది పేరుతో ఓ కామెడీ షో ప్రారంభించారు. దానికి అనుబంధంగాబొమ్మ అదిరింది పేరుతో మరో షో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ షో కొరకు కమెడియన్స్ హరి, పొట్టి రియాజ్ చేసిన స్కిట్జగన్ అభిమానుల కోపానికి కారణం అయ్యింది.
undefined
జగన్ ని పొట్టి రియాజ్ ఇమిటేట్ చేసిన తీరు ఆయనను ఎగతాళి చేస్తున్నట్లుగా ఉన్న నేపథ్యంలో,అభిమానులుసోషల్ మీడియా దాడికి దిగారు. స్కిట్ ప్రదర్శించినహరి, రియాజ్ లతో పాటు నాగబాబు, శ్రీముఖి మరియు జానీ మాస్టర్ కి వార్నింగ్స్ ఇచ్చారు. అలాగే వారిని భయంకరంగా ట్రోల్ చేయడం జరిగింది.
undefined
వివాదాన్ని కొనసాగిస్తూ నాగబాబుసింహాసనంపైకుక్క ఉన్న ఫోటో పోస్ట్ చేసి బొమ్మ అదిరింది అని క్యాప్షన్ పెట్టడం జరిగింది. ఈ ఫోటో జగన్ అభిమానులను మరింతగాఆగ్రహానికి గురిచేసింది. నాగబాబు మరియు ఆయన కూతురు నిహారికలనుఉద్దేశిస్తూ ట్రోల్స్మొదలుపెట్టారు.
undefined
వివాదం నేపథ్యంలోశ్రీముఖి మరియు నిహారికలనుఉద్దేశిస్తూ ట్రోల్ల్స్ చేయడాన్ని నటి మరియు బీజేపీ నేత మాధవీలత తప్పుబట్టారు. శ్రీముఖి, నిహారికలను ట్రోల్ చేయడం దారుణం అని ఆమె జగన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు. నాగబాబు చేసిన కామెంట్ కి నిహారికను ఎలా టార్గెట్ చేస్తారు అన్నారు.
undefined
రియాజ్, హరి క్షమాపణలు చెప్పిన తరువాత కూడా ఈ వ్యక్తిగత దూషణలు ఎందుకు చేస్తున్నారు అన్నారు. శ్రీముఖి వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశిస్తూ దారుణమైన పోస్ట్లు పెడుతున్నారు. ఇది ఆమెను మానసికంగామానభంగం చేయడమే అన్నారు.
undefined
నాగబాబు పోస్ట్ లో ఎవరి పేరు పొందుపరచలేదు. అలాంటిది మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అన్నారు . బీజేపీ నేతగా కాదు ఒక మహిళగా మాట్లాడుతున్నాను అన్నారు. జానీ మాస్టర్ వైఫ్ ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడం సరికాదని గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి మాధవి వ్యాఖ్యలకు జగన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
undefined
click me!